Rajendra Prasad: నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇస్తా..
ABN, Publish Date - Jun 04 , 2025 | 09:57 PM
గత మూడు రోజులుగా నటకిరీటి రాజేంద్రప్రసాద్( Rajendra Prasad)పై ట్రోల్స్ ఎక్కువ వస్తున్న విషయం తెల్సిందే. ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krisna Reddy)పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ నోరుజారాడు.
గత మూడు రోజులుగా నటకిరీటి రాజేంద్రప్రసాద్( Rajendra Prasad)పై ట్రోల్స్ ఎక్కువ వస్తున్న విషయం తెల్సిందే. ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krisna Reddy)పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ నోరుజారాడు. స్టేజిమీద ఉన్నామన్న విషయాన్నీ మరిచి ఆలీ(Ali), రోజా(Roja) లపై అనుచితమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ రాజేంద్రప్రసాద్ ను తిట్టిపోశారు.
ఇక ఆ తరువాత ఆలీ కూడా ఆ వివాదంపై వివరణ ఇచ్చాడు. కానీ, రాజేంద్రప్రసాద్ మాత్రం తమ మధ్య ఉన్న చనువుతో అలా పిలిచానని, అర్ధం చేసుకోవడం, చేసుకోకపోవడం వారి కర్మ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయనపై మరింత నెగిటివిటీ ఏర్పడింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మరోసారి రాజేంద్రప్రసాద్ స్పందించాడు. తన మాటలను అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని, తనపై వస్తున్న విమర్శలకు తానెంతో హర్ట్ అయ్యినట్లు తెలిపాడు.
" ఈ వివాదంలో వచ్చిన విమర్శలు చూసి నేను బాగా హర్ట్ అయ్యాను. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే.. ఆలీకి ఏం ఇబ్బంది లేదు. మేము పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం.. దీని మీరెందుకు పెద్దదిగా చేస్తున్నారని వివరణ కూడా ఇచ్చాడు. ఎవరో ఏదో అనుకున్నట్లు కాదు.. నా దగ్గర ప్రేమలు పంచుకోవడం మాత్రమే ఉంటుంది. ఎందుకంటె ఆ మాత్రం సెంటిమెంట్స్ కూడా లేకపోతే ఇన్ని ఏళ్లు నటుడిగా ఎందుకు ఉంటాను. ఒకరికొకరు ఇన్నేళ్లు ప్రేమను పంచుకోకపోతే ఎలా నా బిడ్డలుగా ఉంటారు. కానీ, ఈసారి మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎంతలా అంటే జీవితంలో ఇంకెప్పుడూ ఎవరిని ఏకవచనంతో పిలవను. ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి నుంచి నేర్చుకున్నాను. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అని పిలవరు. నేను ఈ క్షణం నుంచి నా చివరి శ్వాసవరకు కూడా అందరికీ మర్యాద ఇస్తాను. ఇంకోరకంగా జీవితంలో ఎప్పుడు మాట్లాడను" అంటూ చెప్పుకొచ్చాడు.