Aadi Saikumar: 'శంబాల' నుండి.. ఎమోషనల్ సాంగ్
ABN, Publish Date - Dec 20 , 2025 | 05:13 PM
ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం 'శంబాల'. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి 'పదే పదే' గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) హీరోగా రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’ (Shambhala). యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్ను మెప్పించాయి.
తాజాగా ‘శంబాల’ కథను కాస్త రివీల్ చేసేలా, హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం గురించి చెప్పె ‘పదే పదే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను గమనిస్తే సినిమాలో హీరో ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి హీరో ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో ‘ముగ్గురైనా ఒక్కటేగా’ అంటూ పాటలో చేర్చిన పదాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. ఇక ఈ పాట వింటుంటే కళ్లలో నీళ్ళు చిప్పిల్లేలా ఉంది. ఎమోషనల్గా సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్లో అందరి హృదయాల్ని హత్తుకుంటోంది. ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ (Kittu Vissupragada) సాహిత్యం, యామిని ఘంటసాల గాత్రం, శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) బాణీ చక్కగా కుదిరాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ ను అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.