ఓ బలమైన స్త్రీ కథ
ABN, Publish Date - Jun 18 , 2025 | 03:05 AM
అనంతిక సునీల్ కుమార్ ప్రధాన పాత్రలో ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రి మూవీ మేకర్స్ బేనర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు...
అనంతిక సునీల్ కుమార్ ప్రధాన పాత్రలో ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రి మూవీ మేకర్స్ బేనర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర మంగళవారం మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘‘మను’ సినిమా తర్వాత నాకు ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ కథకు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఒక బలమైన స్త్రీ పాత్ర చుట్టూ కథను చెప్పాలనిపించింది. మా అత్తయ్యలు, ఇంట్లో, చుట్టుపక్కల బలమైన వ్యక్తిత్వాలు ఉన్న స్త్రీల మధ్య పెరిగాను. నేను రాసుకున్న పాత్రకు అనంతిక సునీల్కుమార్ కరెక్ట్ అనిపించింది. కేవలం నటిగానే కాదు. దాదాపు 13 కళల్లో ఆమెకు ప్రవేశం ఉంది. శుద్ధి అయోధ్య పాత్రకు న్యాయం చేసింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన డిగ్నిటీ కోల్పోకుండా ఉండే అమ్మాయి కథ ఇది’ అని వివరించారు.