SJ Suryah: సూర్య హీరోగా.. పాన్ ఇండియా చిత్రం! కిల్లర్ షురూ
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:28 PM
తమిళనాట ఓ ఆసక్తికర చిత్రానికి తెర లేచింది. ఎస్జె సూర్య మళ్లీ దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమై ఓ భారీ పాన్ ఇండియా చిత్రం పట్టాలెక్కింది.
తమిళనాట ఓ ఆసక్తికర చిత్రానికి తెర లేచింది. పదేళ్ల విరామం తర్వాత మల్టీ టాలెంటెడ్ ఎస్జె సూర్య మళ్లీ దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమై ఓ భారీ పాన్ ఇండియా చిత్రం కిల్లర్ పట్టాలెక్కింది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎస్జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూర్చుతుండడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) (Sree Gokulam Movies) ఎస్జె సూర్య (S J Suryah) సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ (Angel Studios) సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
చాలా కాలం తర్వాత గొకులం మూవీస్ తమిళ సినీ రంగంలో కం బ్యాక్ ఇస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వి.సి. ప్రవీణ్, బైజు గోపాలన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కృష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు. గతంలో అజిత్తో ‘వాలి’, ‘న్యూ’, పవన్ కల్యాణ్తో ‘ఖుషీ’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్జె సూర్య దశాబ్దం తర్వాత ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తుండడంతో దక్షిణాదిన ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది.
ట్రూ పాన్ ఇండియాగా రూపొందనున్న ఈ సినిమాలో ఆ స్థాయిలోనే స్టార్ తారాగణం నటించనుండగా సాంకేతిక బృందం, కథా నేపథ్యం వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ ఈ సందర్భంగా వెళ్లడించారు. అయితే తెలుగు నటి ప్రీతి అశ్రాని ఈ సినమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీ గొకులం మూవీస్ ప్రస్తుతం మలయాళంలో సురేశ్ గోపీ ప్రధాన పాత్రలో ‘ఒట్టకొంబన్’, జయసూర్య ఫాంటసీ ఎపిక్ ‘కథనార్’, దిలీప్ ‘భ భ బా’ వంటి భారీ సినిమాలను నిర్మిస్తోంది.