Kolla OTT: ఓటీటీకి వచ్చేసిన.. మలయాళ హైస్ట్ థ్రిల్లర్
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:24 PM
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ మలయాళ హైస్ట్ థ్రిల్లర్ కొల్ల డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓ మలయాళ హైస్ట్ థ్రిల్లర్ కొల్ల (Kolla) డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. మలయాళ ముద్దుగుమ్మలు రజిషా విజయన్ (Rajisha Vijayan), ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) లీడ్ రోల్స్లో నటించిన ఈ చిత్రం 2023లో కేరళ నాట థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే 2008లో కేరళలో నిజంగా జరిగిన చెలెంబ్రా బ్యాంకు దోపిడీ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రంతో సూరజ్ వర్మ (Suraj Varma) దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు.
కథ విషయానికి వస్తే.. అనీ, శిల్ప అనే ఇద్దరు యువతులు బ్యూటీ పార్లర్ పెట్టాలని ఓ బ్యాంక్ కింది షాప్ను కిరాయికి తీసుకుంటారు. పార్లర్ కోసం షాప్లో మరమ్మతు పనులు చేస్తున్నామని బయట ప్రచారం చేసి ఓ రోజు తమకు తెలిసిన వ్యక్తి సాయంతో తమ షాపులో నుంచి బ్యాంకుకు కన్నం వేసి దొరికినంత దోచుకుంటారు. అయితే.. ఫరూక్ రెహామన్ అనే ఎస్సై ఈ కేసును పరిశోధన చేస్తుండగా అప్పటికే సీఐ స్టీఫెన్ దీని వెనకాల ఉన్నాడని తెలుస్తోంది. ఆపైన దాచిన చోట బంగారం మిస్సవడంతో కథ మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువతులు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు, దాచి పెట్టిన బంగారం దొరికిందా అనే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుంది.
సుమారు దశాబ్దంన్నర క్రితం కేరళలో నిజంగా జరిగిన బ్యాంకు రాబరీని బేస్ చేసుకుని ప్రధాన నిందితులను మొగవాళ్ల బదులు యువతులను ప్రధాన పాత్రలుగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీని చివరి వరకు మంచి సస్పెన్స్ మొయింటన్ చేస్తూ చూసే వారికి మంచి హైస్ట్ ఫీల్ను అందజేశారు. పిల్లలు, పెద్దలు అంతా కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని చూసేయవచ్చు. ఎక్కడా ఎలాంటి అభ్యంతర కర సన్నివేశాలు లేవు. ఇప్పుడు ఈ టీవీ విన్ (ETV Win) ఓటీటీలో కొల్ల (Kolla) స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ వీకెండ్ వీక్షకులకు బెస్ట్ ఆప్షన్.