సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కుబేర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:43 AM

‘‘శేఖర్‌ కమ్ముల పైకి చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఆయన్ని చూస్తూనే మనకి అలా అనిపిస్తుంది. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్లే మొండి పట్టుదల కలవారు. ఆయన...

‘‘శేఖర్‌ కమ్ముల పైకి చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఆయన్ని చూస్తూనే మనకి అలా అనిపిస్తుంది. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్లే మొండి పట్టుదల కలవారు. ఆయన నమ్మే సిద్ధాంతాలనే సినిమాలుగా తీస్తారు. ఆయనలోని ఈ గుణాన్ని నేను ఎంతో గౌరవిస్తాను. ఆయన ముందు ముందు కూడా ఇలానే మనకు మరిన్ని మంచి సినిమాలు అందించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌ నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి మాట్లాడుతూ ‘‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర’ టీజర్‌ చూసి ఆశ్చర్యపోయాను. మేకింగ్‌ అద్భుతంగా ఉంది. తొలి రోజే సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘ధనుష్‌ మీ సినిమాలు చేశాను. సెట్స్‌లో మీరు పాత్రలోకి ఎలా పరకాయ ప్రవేశం చేస్తారో చూశాను. మీతో కలసి పనిచేయడం గొప్ప జ్ఞాపకం. ఇది కంప్లీట్‌గా శేఖర్‌ కమ్ముల సినిమా. ఈ చిత్రానికి ఆయనే హీరో’’ అని చెప్పారు. ధనుష్‌ మాట్లాడుతూ ‘‘ఇది ‘సార్‌’ తర్వాత నా రెండో తెలుగు చిత్రం. నిజానికి ‘సార్‌’ కంటే ముందే శేఖర్‌ కమ్ముల ఈ కథ చెప్పారు. మీ ముందుకు రావడానికి ఇంత టైమ్‌ పట్టింది. ఆయనో అద్భుత వ్యక్తి. చిన్నప్పటి నుంచి నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలసి నటించడం మరిచిపోలేని అనుభవం.


ఇది రెండు భిన్న ప్రపంచాల మధ్య జరిగే కథ’’ అని పేర్కొన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘రాజమౌళి ఈ కార్యక్రమానికి రావడంతో ‘కుబేర’ చాలా పెద్ద సినిమా అయ్యింది. దర్శకుడిగా అప్పుడే 25 ఏళ్లు అయ్యాయా అనిపిస్తోంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నిజాయితీగా తీసిన సినిమా ఇది. చాలా కొత్తగా ఉంటుంది. ట్రూ పాన్‌ ఇండియా చిత్రమిది. అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని తెలిపారు. నిర్మాత సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి ఇప్పుడేం మాట్లాడను. సినిమా విడుదలయ్యాక సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతా’’ అని అన్నారు. నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహన్‌ రావు మాట్లాడుతూ ‘‘ఇదో విభిన్న చిత్రం. నాగార్జున,ధనుష్‌ నటన ఈ సినిమాకే హైలెట్‌గా ఉండబోతోంది’’ అని అన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:43 AM