డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున
ABN, Publish Date - Jun 08 , 2025 | 04:06 AM
నాగార్జున, ధనుష్ కథానాయకులుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం కుబేర. ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. తాజాగా...
నాగార్జున, ధనుష్ కథానాయకులుగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం కుబేర. ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమాలో తన పాత్ర డబ్బింగ్ను పూర్తి చేశారు నాగార్జున. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామ్మోహన్ కలసి మాట్లాడుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. రష్మిక కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.