విడుదలకు సిద్ధమైన ఘాటీ
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:32 AM
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటీ’. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు...
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటీ’. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజీవ్రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా, ఈ సినిమాను జూలై 11న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించి ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. సినిమాలోని ప్రధాన పాత్రధారులు సంచులు మోసుకుంటూ నదిని దాటుతున్న విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్: చాణక్యరెడ్డి తూరుపు, వెంకట్ ఎన్.స్వామి, సినిమాటోగ్రఫీ:మనోజ్రెడ్డి కాటసాని, సంగీతం:నాగవెల్లి విద్యాసాగర్. కాగా, ‘వేదం’ తర్వాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.