Krish 4: హృతిక్తో నేషనల్ క్రష్..
ABN, Publish Date - Sep 20 , 2025 | 10:08 AM
హృతిక్ రోషన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిష్’ చిత్రానికి మరో సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించాయి.
హృతిక్ రోషన్ (Hrithik Roshan) కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిష్’ (Krish -4) చిత్రానికి మరో సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం మూడు పార్టులుగా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం సాధించాయి. ఇప్పుడు క్రిష్-4 కూడా రానున్నట్లు రాకేశ్ రోషన్ 9Rakesh Roshan) అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికో విశేషం ఉంది. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటించడమే కాకుండా స్వయంగా ఆయనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. దర్శకుడిగా హృతిక్కు తొలి చిత్రమిది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కథానాయిక కోసం వేట మొదలుపెట్టారు మేకర్స్. అయితే ఈ చిత్రం కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను (Rashmika Mandanna) సంప్రదించినట్లు, ఆమె అంగీకారం తెలిపినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.
త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది చిత్రీకరణను మొదలుపెడతామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాకేశ్ రోషన్ తెలిపారు. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రష్మిక ఈ చిత్రంలో ఉందో లేదో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే!