Rashmi Gautam: సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వైతరణి
ABN, Publish Date - Jun 28 , 2025 | 06:47 PM
తెలుగులో, బుల్లితెర, పెద్దతెరపై తన అందాల విందు చేస్తూ వీక్షకులను ఆకట్టుకుంది రష్మీ గౌతమ్. ఇప్పుడు బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందామె.
బుల్లితెర ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఇప్పటికే పలు చిత్రాలలో నటించింది. డిజిటల్ కెమెరాల్లో సినిమాలు తీయడం మొదలైన కొత్తలోనే ఆమె 'సవ్వడి' (Savvadi) అనే చిత్రంలో నటించింది. అలానే పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించడంతో పాటు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ యాక్ట్ చేసింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై రాని పేరు ఆమెకు టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా లభించింది. అయితే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే కోరిక రష్మీ గౌతమ్ లో ఇంకా సజీవంగానే ఉంది.
వైతరణి అనేది భారతీయ ఇతిహాసాలలో చెప్పిన ఓ నది. మరణించిన మనిషి ఆత్మ వైతరణీ నది దాటి వెళ్ళుతుందని, దానిని దాటటం అంత ఆషామాషీ వ్యవహారం కాదని గరుడపురాణంలో ఉన్నట్టు చెబుతుంటారు. అలాంటి వైతరణి నది పేరునే ఈ సినిమాకు పెట్టడం ఆసక్తిని కలిగిస్తోంది. మనిషి జీవితానికి మరణానికి సంబంధించిన అంశాలను ఈ సైకలాజికల్, సూపర్ నేచురల్ మూవీలో ప్రస్తావిస్తారని అర్థం అవుతోంది. ఆర్.కె. కాంతలక్ష్మీ, ఆర్. రమేశ్ బాబు ఈ సినిమాను నిర్మించారు. తాజాగా విడుదలైన పోస్టర్ ను చూస్తుంటే 'తుంబాడ్ (Thubbad), పిశాసు (Pisaasu), నికిత రాయ్ (Nikita Roy)' వంటి సినిమాలను జ్ఞప్తికి తెచ్చేలా ఉంది. మరి తెలుగువారి మదిలో ఇప్పటికే చోటు సంపాదించుకున్న రష్మీ గౌతమ్ 'వైతరణి'తో ఉత్తరాది వారి మనసును ఏమేరకు గెలుచుకుంటుందో చూడాలి.
Also Read: July Releases జులైలో లక్కు కిక్కు చూసేదెవరో...