Mannara Chopra: నటి మన్నారా చోప్రా ఇంట విషాదం
ABN , Publish Date - Jun 16 , 2025 | 09:51 PM
బాలీవుడ్ నటి మన్నారా చోప్రా(Mannara Chopra)ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మన్నారా తండ్రి రమణ్ రాయ్ హండా(72) మృతి చెందారు.
Mannara Chopra: బాలీవుడ్ నటి మన్నారా చోప్రా(Mannara Chopra)ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మన్నారా తండ్రి రమణ్ రాయ్ హండా(72) మృతి చెందారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు మన్నారా తెలిపింది. ఆయన అంత్యక్రియలు జూన్ 18 న వెస్ట్ అంధేరిలో జరగనున్నట్లు తెలిపింది. రమణ్ రాయ్ హండా మరణంతో చోప్రాస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెల్సిన పలువురు ప్రముఖులు మన్నారాకు సానుభూతి తెలుపుతూ.. రమణ్ రాయ్ హండా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మన్నారా చోప్రా.. 2014లో తెలుగులో విడుదలైన ప్రేమ గీమ జాన్తా నయ్ సినిమా ద్వారాఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత సునీల్ హీరోగా నటించిన జక్కన్న చిత్రంలో నటించి మెప్పించింది. ఇక సీత సినిమాలో కాజల్ కు అసిస్టెంట్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Rahul Dev: నా తమ్ముడు ముకుల్ దేవ్ మరణానికి డిప్రెషన్ కారణం కాదు
మన్నారా చోప్రా.. బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియంకా చోప్రా, పరిణీతి చోప్రాకు బంధువు అన్న విషయం తెల్సిందే. ఇక సినిమాల కన్నా మన్నారా.. హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో పాల్గొని మరింత గుర్తింపును తెచ్చుకుంది. ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్ లో పలు సినిమాల్లోనటిస్తూ బిజీగా మారింది.