Manchu Lakshmi: మరోసారి ట్రోలింగ్ కు గురైన మంచు లక్ష్మీ..
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:43 PM
ఇక ట్రోల్స్ లో మంచు ఫ్యామిలీ ఎప్పుడు మొదట వరుసలో ఉంటుంది. మొదటి నుంచి కూడా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటూనే వస్తున్నారు.
Manchu Lakshmi: ఒకప్పుడు స్టార్ హీరోలు ఎక్కడ షూటింగ్చేస్తున్నారు .. వారి కుటుంబం ఏంటి.. ? ఏ సినిమా చేసున్నారు అనేది అసలు బయటకు తెలిసేది కాదు. ఎక్కడైనా ఒక ఈవెంట్ లో ఎవరైనా జంటగా కనిపిస్తే తప్ప వారిమీద పుకార్లు వచ్చేవి కావు. ఇప్పుడు అలాకాదు. సోషల్ మీడియా వచ్చాకా అంతా మారిపోయింది. ఈ జనరేషన్ లో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వారే మారిపోతారు. స్టేజిల మీద ఇష్టానుసారం మాట్లాడినా.. తెలిసి తెలియకుండా పురాణ ఇతిహాసాల గురించి కానీ, వేరే సమస్యల గురించి కానీ మాట్లాడితే.. నిర్మొహమాటంగా ఏకిపారేస్తున్నారు.
ఇక ట్రోల్స్ లో మంచు ఫ్యామిలీ ఎప్పుడు మొదట వరుసలో ఉంటుంది. మొదటి నుంచి కూడా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ(Manchu Lakshmi) తన ఇంగ్లీష్ తో ఎప్పటికప్పుడు ట్రోల్ కు గురవుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం ఆమె పురాణాల విషయంలో తెలిసీ తెలియకుండా మాట్లాడి నెట్టింట ట్రోలింగ్ కు గురైంది.
Manchu Vishnu: కన్నప్పను వీక్షించిన రజినీకాంత్.. విష్ణు ఎమోషనల్
గత కొంతకాలం క్రితం మంచు లక్ష్మీ తన కెరీర్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చిన విషయం తెల్సిందే. తన కెరీర్ గురించి మాత్రమే కాకుండా తన కూతురు చదువు కోసం ముంబైకి వెళ్లినట్లు తెలిపింది. ఇక అక్కడకు వెళ్ళాకా లక్ష్మీ అందాల ఆరబోతను పెంచింది. నిత్యం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇక ఈ మధ్యనే మంచు లక్ష్మీ కరణ్ జోహార్ ది ట్రైటర్స్ లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఇదొక రియాలిటీ గేమ్ షో. కొంచెం బిగ్ బాస్ లానే అయినా కూడా ఒక ఇంట్లో కాకుండా కొన్ని కొన్ని ప్లేస్ లలో ఈ గేమ్స్ ఆడతారు. దాదాపు 20 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్న ఈ గేమ్ షోలో మంచు లక్ష్మీ ఒకరు.
తాజాగా ది ట్రైటర్స్ లో మంచు లక్ష్మీ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాగా ఆమె పురాణాల గురించి తప్పుగా మాట్లాడుతూ ఒకతనితో గొడవ పడుతుంది. మహాభారతంలో అర్జునుడు గొప్ప విలుకారుడు అని అందరికీ తెల్సిందే. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు.. నీటిలో ఉన్న చేప ప్రతిబింబంను చూస్తూ పైన ఉన్న చేప కంటిని కొడతాడు. అలా స్వయంవరంలో ద్రౌపదిని వివాహామాడతాడు. మహాభారతంలోని ఈ కథ అందరికీ తెలుసు. అయితే మంచు లక్ష్మీ ఈ అర్జునుడు కథను రాముడి కథగా చెప్పుకొచ్చింది.
" అది చేప.. రామాయణంలో రాముడు చేపను నీళ్లలో చూస్తూ విల్లు ఎత్తి గురి చూసి కొడతాడు" అంటూ వేరొకరితో వాదించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రామాయణానికి, మహాభారతానికి తేడా తెలియదా.. ? రాముడు శివ ధనుస్సును విరిచి సీతను పెళ్లాడాడు. అర్జునుడు విల్లుతో చేపను కొట్టి ద్రౌపదిని పెళ్లాడాడు. కనీసం ఈ తేడా కూడా తెలియకుండా ఎలా వాదిస్తున్నావ్ అంటూ నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. సెలబ్రిటీలు పురాణాల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇలాగే ట్రోలింగ్ కు గురవుతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.