Genelia: జాన్ అబ్రహాంతో పెళ్లి.. నోరు విప్పిన జెనీలియా
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:41 PM
బొమ్మరిల్లు(Bommarillu) సినిమాతో హా హా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరపలేని స్థానాన్ని సంపాదించుకుంది జెనీలియా(Genelia).
Genelia: బొమ్మరిల్లు(Bommarillu) సినిమాతో హా హా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరపలేని స్థానాన్ని సంపాదించుకుంది జెనీలియా(Genelia). తెలుగులో స్టార్ హీరోలందరితో ఆడిపాడిన జెనీలియా.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్(Riteish Deshmukh) ను పెళ్లి చేసుకొని సినిమాలకుదూరమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. వారు పెద్దయ్యాక మళ్లీ జెనీలియా రీఎంట్రీ ఇచ్చింది. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క నటిగా బిజీగా మారింది. బాలీవుడ్ లో అడోరబుల్ కపుల్ గా జెనీలియా, రితేష్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు వీరిద్దరి మధ్య గొడవలు అని కానీ, వేరే ఎఫైర్స్ అని కానీ ఇప్పటివరకు వచ్చినట్లు దాఖలాలు లేవు. అయితే వీరి పెళ్ళికి ముందు జెనీలియా... బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ను సెట్ లో సీక్రెట్ గా వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. పెళ్లి సీన్ కాకుండా పంతులు వీరిద్దరికీ నిజంగానే పెళ్లి చేశాడని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ వార్తపై ఎప్పుడూ కూడా నోరు విప్పని జెనీలియా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.
Manchu Lakshmi: మరోసారి ట్రోలింగ్ కు గురైన మంచు లక్ష్మీ..
" జాన్ అబ్రహం, నేను కలిసి ఫోర్స్ అనే సినిమాలో నటించాం. ఆ సినిమా సెట్ లో అనుకోకుండా మా పెళ్లి జరిగిందని వార్తలు ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదు. అప్పుడు కొందరు పీఆర్ టీమ్స్ ఈ వార్తలను సృష్టించారు. మరి ఆ వార్తలు వారెందుకు సృష్టించారో వారినే అడగండి" అంటూ చెప్పుకొచ్చింది.
2011 లో జాన్అబ్రహాం , జెనీలియా నటించిన సినిమా ఫోర్స్ రిలీజ్ అయ్యింది. ఆ తరువాతి ఏడాదినే జెనీలియా, రితేష్ వివాహం చేసుకున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత జెనీలియా.. ఆమీర్ ఖాన్ తో జత కట్టింది. వీరిద్దరూ జంటగా నటించిన సితారే జమీన్ పర్ జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో జెనీలియా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.