Abhishek Bachchan: అభిషేక్ ట్వీట్ వెనుక అసలు మర్మం...

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:29 PM

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టైప్ లో ఉంటాయి ఇండస్ట్రీ మేటర్స్. పూర్తి విషయం చెబితేనే అందరికీ అర్థం కావు. అలాంటిది సగం విషయం చెప్పి వదిలేస్తే ఎలా ఉంటుంది. బిగ్ బి అమితాబ్ కుమారుడు చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అలాగే ఉంది. అసలు విషయం చెప్పకుండా.. సవాలక్ష డౌట్లు వదిలేసిపోయాడు. అయితే ఆ తర్వాత ఈ సందేహాలకు ఫుల్ టాప్ పెట్టేశాడు.

బాలీవుడ్‌ స్టార్ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కొడుకుగా, ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) భర్తగా ఎప్పుడూ లైమ్‌లైట్‌లోనే ఉంటాడు. రీసెంట్ గా 'హౌస్‌ఫుల్ 5' తో బాక్సాఫీస్‌ హిట్ కొట్టిన ఈ హీరో.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఓ బాంబు పేల్చాడు. ఆ పోస్ట్ చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా గుసగుసలతో నిండిపోయింది.


అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో హిందీలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఒక్కోసారి దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. తన సొంత వాళ్ల కోసం జీవితం అంతా ఇచ్చేశానని... ఇప్పుడు తనకు తాను కావాలనుకుంటున్నానని రాసుకొచ్చాడు. దీన్ని చూసినవారంతా, ఇది సాదాసీదా పోస్ట్ కాదు అని.. దీని వెనక ఏదో డీప్ మ్యాటర్ ఉందని ఫీల్ అయ్యారు. ఇలా పెట్టగానే ఆ పోస్ట్ అలా వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్లు రకరకాల గాసిప్‌లతో రెచ్చిపోయారు. అభిషేక్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా.. అని ఒకరు కామెంట్ చేస్తే.. విడాకులు తీసుకోబోతున్నారని ఇంకొకరు కామెంట్ చేశారు.

అభిషేక్ పోస్ట్‌తో ఒక్కసారిగా అభిషేక్ - ఐశ్వర్య రాయ్ విడాకుల గురించిన పాత రూమర్స్ మళ్లీ తెరపైకొచ్చాయి. ఐశ్వర్యతో గొడవలతో ఈ వయసులో ఒంటరిగా ఉండాలను కోవడం ఏంటి అంటూ కొందరు సీరియస్‌గానే అనుమానాలు వెలిబుచ్చారు. కట్ చేస్తే... తన అప్ కమింగ్ మూవీ 'కాళీధర్‌ లాపతా' (kalidhar lapata) మూవీ ప్రమోషన్ లో భాగంగా అభిషేక్ ఈ పోస్ట్ పెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత కొద్ది గంటలకే అభిషేక్ తన కొత్త సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నెటిజన్స్ అనుమానాలకు, అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కుటుంబ కోసం సర్వస్వాన్నీ ధారపోసిన తర్వాత వయసు మీద పడటంతో ఆ కుటుంబం అతన్ని వద్దనుకుంటుంది. దాంతో ఇంటి పెద్ద కుటుంబానికి దూరంగా ఒంటరిగా బతకాలనే నిర్ణయం తీసుకుంటాడు. అదే సమయంలో అతనికి ఎనిమిదేళ్ళ అనాథ కుర్రాడితో పరిచయం అవుతుంది. వారిద్దరి ప్రయాణం కొంతకాలం సాగుతుంది. ఈ క్రమంలో పెద్దాయన ఆలోచనల్లో ఎలాంటి మార్పు వచ్చిందన్నదే 'కాళీధర్ లాపతా' మూవీ కథ.


WhatsApp Image 2025-06-19 at 5.17.26 PM.jpeg'కాళీధర్ లాపతా' చిత్రం నిజానికి తమిళ రీమేక్. తమిళంలో మధుమిత తీసిన 'కరుప్పు దురై' చిత్రాన్ని హిందీలో తీశారు. అయితే మాతృకకు దర్శకత్వం వహించిన మధుమితనే హిందీలోనూ ఈ సినిమాను రూపొందించింది. ఈ సినిమా జూలై 4న జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతోంది.

Also Read: Salman - Aamir Khan: అతడు ఆగడం లేదు.. మీరు చేయడం లేదు

Updated Date - Jun 19 , 2025 | 05:31 PM