Guntur Kaaram: కొంచెం చూసుకోవాలి క‌దా గురూజీ .. గుంటూరు కారం ఆ సీన్‌పై ట్రోలింగ్‌

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:15 PM

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట‌గా మూడో సారి క‌లిసి చేసిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్ వద్ద రూ. 285 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్ర‌స్తుతం ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశంపై నెట్టింట‌ బాగా చ‌ర్చ న‌డుస్తోంది.

Guntur Kaaram: కొంచెం చూసుకోవాలి క‌దా గురూజీ .. గుంటూరు కారం ఆ సీన్‌పై ట్రోలింగ్‌
gunturu kaaram

మ‌హేష్ బాబు (Mahesh Babu), త్రివిక్ర‌మ్ ముచ్చ‌ట‌గా మూడో సారి క‌లిసి చేసిన సినిమా గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సంక్రాంతికి విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 285 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్ర‌స్తుతం ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. చాలా మంది ఈ సినిమాను వీక్షిస్తూ సోష‌ల్ మీడియాలో రోజూ పాట‌ల విషయంలోనో, డ్యాన్సుల విష‌యంలోనో ఇలా ఏదో ర‌కంగా ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. తాజాగా చిత్రంలోని ఓ స‌న్నివేశంపై బాగా చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే సినిమాలో హీరో, హీరో తండ్రి ఒక ద‌గ్గ‌రే నివ‌సిస్తుండ‌గా త‌ల్లి మాత్రం వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని సిటీలో ఉంటూ పాలిటిక్స్‌లో బిజీగా ఉంటుంది. ఊర్లో ఉండే హీరో తండ్రి తిరిగి త‌న భార్య వ‌స్తుందేమోన‌ని ఓ కిటికీ ద‌గ్గ‌ర కూర్చుని గ్రామఫోన్‌లో పాత పాటలు వింటూ రోడ్డు వైపు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలో సినిమా క్లైమాక్స్‌లో అత‌ను ఎదురు చూసే కిటికీ వైపు నుంచే త‌న భార్య వ‌చ్చే విష‌యాన్ని గ‌మ‌నిస్తాడు కూడా. ఇప్పుడు ఈ స‌న్నివేశం విష‌యంలోనే నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది.


సినిమాలో ఓ సంద‌ర్భంలో.. ‘ఎప్పుడూ ఆ పాత పాటలు పెట్టుకుని.. ఆ కిటికీ వైపే చూస్తూ ఉంటావు. పోనీ భార్య కోసం చూస్తున్నాడా అంటే? హైదరాబాద్ అటు లేదు. ఇటు ఉంది’ అంటూ హీరో త‌న తండ్రిని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ను గుర్తు చేస్తున్నారు. సినిమా ఫ్రీ క్లైమాక్స్‌లో హైదరాబాద్ తండ్రి కూర్చునే ఎదురుగా లేదు.. వెన‌క‌కు ఉందని హీరోతో చెప్పించిన త్రివిక్ర‌మ్.. క్లైమాక్స్‌లో మాత్రం తండ్రి కూర్చునే కిటీకీ వైపు నుంచి తీసుకురావ‌డంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కొంచెం చూసుకోవాలి క‌దా గురూజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 05:15 PM