Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

ABN , Publish Date - Feb 24 , 2024 | 09:31 PM

కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న వార్తకు అధికారిక ప్రకటన వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయింది. ఈ కాంబినేషన్‌పై కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా నాని పుట్టినరోజును పురస్కరించుకుని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ Nani32 చిత్ర ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది.

Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది
Nani32 Announcement Poster

కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న వార్తకు అధికారిక ప్రకటన వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ (OG Director Sujeeth) కాంబినేషన్‌లో సినిమా ఓకే అయింది. ఈ కాంబినేషన్‌పై కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా నాని పుట్టినరోజును పురస్కరించుకుని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ Nani32 చిత్ర ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం నాని ఇదే బ్యానర్‌లో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Savinaavaram) చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సుజీత్ కూడా ఇదే బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ (Pawan Kalyan OG) సినిమాను చేస్తున్నారు. వెంటవెంటనే ఇలా కాంబినేషన్ కుదరడం ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అలా సెట్ చేసింది.

Danayya.jpg

Nani32 చిత్ర విషయానికి వస్తే.. ఈ చిత్ర ప్రకటనతో పాటు ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో ఒక హింసాత్మక వ్యక్తి.. అహింసాత్మక వ్యక్తిగా ఎలా మారాడు? అతని ప్రపంచం ఎందుకు తలకిందులుగా మారుతుంది.. అనే కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుందనే విషయాన్ని ఈ అనౌన్స్‌మెంట్ వీడియో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి నాని కూడా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘ఇది సుజీత్‌ చిత్రం.. పవర్ తర్వాత లవర్‌తో వస్తాడు’ అంటూ ‘ఓజీ’కి లింక్ పెడుతూ ఆయన చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.


ఇక ఈ సినిమా ప్రస్తుతం నాని చేస్తున్న ‘సరిపోదా శనివారం’ పూర్తవగానే సెట్స్‌పైకి వెళుతుందని మేకర్స్ తెలియజేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..

*****************************

*Chari 111: ‘చారి 111’కు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమానే స్ఫూర్తి

*************************

*Sumaya Reddy: దేవాలయానికి ‘డియర్ ఉమ’ హీరోయిన్ విరాళం

*************************

*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది

************************

Updated Date - Feb 24 , 2024 | 09:39 PM