Tamannaah: కాశీలో ప్రత్యేక పూజలు... భావోద్వేగంతో కాజల్‌కు రిప్లై

ABN , Publish Date - Mar 04 , 2024 | 05:13 PM

'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది మిల్కీబ్యూటీ తమన్నా. హ్యాపీడేస్‌ చిత్రంతో విజయం అందుకుని నటిగా గుర్తింపు పొందింది. 'కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం', 100% లవ్‌ చిత్రాలతో స్టార్‌గా ఎదిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది. అగ్ర హీరోలతో, భారీ బడ్జెట్‌ చిత్రాలలో అవకాశాలు అందుకుని ఉన్నత స్థాయికి చేరుకుంది.

Tamannaah: కాశీలో ప్రత్యేక పూజలు... భావోద్వేగంతో కాజల్‌కు రిప్లై

'శ్రీ' సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah). హ్యాపీడేస్‌ చిత్రంతో విజయం అందుకుని నటిగా గుర్తింపు పొందింది. 'కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం', 100% లవ్‌ చిత్రాలతో స్టార్‌గా ఎదిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది. అగ్ర హీరోలతో, భారీ బడ్జెట్‌ చిత్రాలలో అవకాశాలు అందుకుని ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆమె నటిగా కెరీర్‌ ప్రారంభించి 19 ఏళ్లు పూర్తి చేసుకుని 20వ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు తమన్నాకు అభినందనలు తెలుపుతున్నారు. తన తోటి నటి కాజల్‌ (Kajal)కూడా తమన్నాకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు కాజల్‌ ట్వీట్‌ చేశారు.  ఫ్యాన్స్  ఎడిట్‌ చేసిన ఫొటో షేర్‌ చేసి ఆల్మోస్ట్‌ రెండు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నావు. కంగ్రాట్స్‌ డార్లింగ్‌’’ అని పోస్ట్‌ చేశారు. దీనికి తమన్నా రిప్లై ఇచ్చారు. (19 years of Tamannaah)

Tam-3.jpg

ప్రేమ వల్లే  సాధ్యం ..

‘థాంక్యూ కాజు. ఇన్ని సంవత్సరాల నుంచి నాకెంతో మద్దతుగా నిలిచావు. హద్దులు లేనిప్రేమను పంచావు. నీ లాంటి స్నేహితురాలు ఉండడం వల్లే నా కెరీర్‌ సాఫీగా కొనసాగుతోంది. అభిమానులు చూపించే ప్రేమ, అంకితభావం, వాళ్ల ఉత్సాహం నాకు రెట్టింపు శక్తినిస్తాయి. మీ అందరి ప్రేమ, సపోర్ట్‌తో మున్ముందు మీ అందరికీ నచ్చే చిత్రాలను అందిస్తానని మాటిస్తున్నా. రానున్న సంవత్సరాలు ప్రేమతో నిండిన లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందిస్తాయని ఆశిస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు.

tam-1.jpg

అప్పుడు కామాఖ్యా... ఇప్పుడు కాశీలో..
ఇటీవల కామాఖ్యా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మిల్కీ బ్యూటీ నేడు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంది. అక్కడ స్వామి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు తమన్నా. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి.

tam-2.jpg


ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లతోనూ తమన్నా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘ఓదెల 2’లో తమన్నా ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Kajal.jpg

Updated Date - Mar 04 , 2024 | 05:59 PM