SSMB29: మలయాళ నటుడు నిజమైనా? అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్!

ABN , Publish Date - May 18 , 2024 | 04:51 PM

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్‌ రాజమౌళి SS Rajamouli) దర్శకత్వంలో "ఎస్‌ఎస్‌ఎంబీ 29" తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా సెట్స్‌ మీదకి ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని అభిమానులు  ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు

SSMB29:  మలయాళ నటుడు నిజమైనా? అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్!

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్‌ రాజమౌళి SS Rajamouli) దర్శకత్వంలో "ఎస్‌ఎస్‌ఎంబీ 29" తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ఈ సినిమా సెట్స్‌ మీదకి ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని అభిమానులు  ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అలాగే రకరకాల వార్తలు ఈ చిత్రంపై వస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ట్విట్టర్‌లో షేర్‌ అవుతూ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇటీవల రాజమౌళి పలు ఫొటోషూట్‌లు నిర్వహించారు. మహేష్ దుబాయ్‌లో స్కేటింగ్‌ ప్రాకీస్ట్‌ చేసొచ్చారు. మరో పక్క ప్రీ ప్రొడక్షన్  వర్క్‌ కూడా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ (prudhvi raj sukumaran) సుకుమారన్ ఓ  కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ విషయమై పృథ్వీరాజ్‌ను రాజమౌళి సంప్రదించారని.. ఆయన కూడా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇందులో విలన్‌గా కనిపించనున్నారట.

Untitled-1.jpg

దీనిపై అధికారిక ప్రకటన కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మహేశ్‌-పృథ్వీను ఒకే  స్క్రీన్ పై  చూడొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు. ప్రభాస్‌ నటించిన 'సలార్‌'లో పృథ్వీరాజ్‌ సుకుమారన నటించిన సంగతి తెలిసిందే!  తాజాగా ఈ సినిమా కాస్టింగ్‌ డైరెక్టర్‌ విషయంలో రూమర్స్‌ రాగా టీమ్‌ వాటిని ఖండించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ అప్‌డేట్‌ అయినా నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటిస్తుంది. గాసిప్‌లను నమ్మవద్దు అని క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం ఆగస్ట్‌ నుంచి సెట్స్‌ మీదకెళ్లనుంది.

Updated Date - May 18 , 2024 | 04:51 PM