Rashmika Mandanna: ముచ్చటగా మూడోసారి కలవబోతున్నారు!

ABN , Publish Date - May 12 , 2024 | 11:00 AM

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika mandanna)దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇటీవల  సల్మాన్ ఖాన్  హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో వహిస్తున్న 'సికిందర్‌' చిత్రానికి సైన్  చేసింది.

 Rashmika Mandanna: ముచ్చటగా మూడోసారి కలవబోతున్నారు!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika mandanna)దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇటీవల  సల్మాన్ ఖాన్  హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో వహిస్తున్న 'సికిందర్‌' చిత్రానికి సైన్  చేసింది. ఇప్పుడు వరుసగా ఆమె చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మూడు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా మరో చిత్రంతో నటించబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ (Rahul Sankrithyan) దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందనున్న సంగతి తెలిసిందే. 1854-1978 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా అల్లిన కథతో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. విజయ్‌ - రష్మిక ఇంతకు ముందు ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో కలిసి నటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఇది వారిద్దరికీ మూడో చిత్రం అవుతుంది. ఈ చిత్రం అక్టోబరు నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఇటీవల  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ వెల్లడించింది. 

Updated Date - May 12 , 2024 | 11:00 AM