Naa saami Ranga: కిట్టయ్యకు నరకడం తెలుస్తాది కానీ... సరసం ఎట్టా తెలుస్తాది?

ABN , Publish Date - Jan 09 , 2024 | 05:04 PM

'బంగార్రాజు’ చిత్రం మినహా వరుసగా ఆరు పరాజయాలు చవిచూశారు అక్కినేని నాగార్జున. ఏడాది గ్యాప్‌ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం 'నా సామి రంగా’. అషికా రంగనాథ్‌ కథానాయిక. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ , రాజ్‌ తరుణ్‌, రుక్సార్‌ థిల్లాన్ , మీర్నా మీనన్  ఇతర పాత్రధారులు.

Naa saami Ranga: కిట్టయ్యకు నరకడం తెలుస్తాది కానీ... సరసం ఎట్టా తెలుస్తాది?

.

'బంగార్రాజు’ చిత్రం మినహా వరుసగా ఆరు పరాజయాలు చవిచూశారు అక్కినేని నాగార్జున (Nagarjuna). ఏడాది గ్యాప్‌ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం 'నా సామి రంగా’ (Naa saami ranga). అషికా రంగనాథ్‌ కథానాయిక. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ , రాజ్‌ తరుణ్‌, రుక్సార్‌ థిల్లాన్ , మీర్నా మీనన్  ఇతర పాత్రధారులు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. 

మాస్‌ లుక్‌, మాస్‌ డైలాగ్‌లతో నాగార్జున అదరగొట్టారు. పక్కా గ్రామీణ నేపథ్యం తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లో నాగార్జున, అల్లరి నరేశ డైలాగ్‌లు, మేనరిజం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఎలాంటి అంచనాలు లేకుండా ఉన్న ఈ చిత్రానికి ఈ ట్రైలర్‌ ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చింది. అయితే స్టోరీ పెద్దగా రివీల్‌ చేయలేదు. యాక్షన్‌ మాత్రం గట్టిగానే ఉన్నట్లు అర్థమైంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 


Updated Date - Jan 09 , 2024 | 05:04 PM