Anupama Parameswaran: ఆయనతో నాలుగో సినిమా.. ఇప్పుడు మార్చుకోలేను! 

ABN , Publish Date - Feb 05 , 2024 | 10:53 AM

మాస్‌ మహారాజా రవితేజ (Ravi teja) హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle) సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌ ఘట్టమనేని (karthik Ghattamaneni) ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌9Anupama parameswaran), కావ్యా థాపర్‌ కథానాయికలు.

Anupama Parameswaran: ఆయనతో నాలుగో సినిమా.. ఇప్పుడు మార్చుకోలేను! 

మాస్‌ మహారాజా రవితేజ (Ravi teja) హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle) సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌ ఘట్టమనేని (karthik Ghattamaneni) ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌9Anupama parameswaran), కావ్యా థాపర్‌ కథానాయికలు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేనికి హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ రాఖీ కట్టింది. వేదికపైకి వచ్చిన అనుపమ డైరెక్టర్‌ను అన్నయ్య అని పిలిచింది. 

Anupama.jpg

అంతకుముందు స్క్రీన్ పై సెట్ లో జరిగిన  వీడియో ప్లే చేశారు. అందులో రవితేజ.. ‘నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే పదం వాడకూడదు.. నేను ఎందుకు చెప్పానో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో’ అని చెప్పారు. ఆ వీడియో పూర్తయిన తర్వాత అనుపమ సారీ రవి గారు.. ‘దర్శకుడు కార్తీక్‌తో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. మొదటి నుంచి ఆయనను అన్నయ్య అనే నేను పిలుస్తున్నాను.  పేరు పెట్టి కూడా పిలవలేను.  అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్చుకోలేను’ అని చెబుతూ సుమ ఇచ్చిన ఓ రాఖీని కార్తీక్‌కు కట్టేసింది అనుపమ. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది.  


Updated Date - Feb 05 , 2024 | 10:54 AM