Allu Arjun: ఆ విగ్రహం చూడగానే సంతోషంగా అనిపించింది

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:45 PM

మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame tussauds)నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ (Allu arjun). అక్కడ తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై అల్లు అర్జున్‌ స్పందించారు.

Allu Arjun:  ఆ విగ్రహం చూడగానే సంతోషంగా అనిపించింది
Allu Arjun


మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame tussauds)నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ (Allu arjun). అక్కడ తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘‘ఓరోజు మా ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడి మా స్టాఫ్‌ అంతా నన్ను చూసి నవ్వుతున్నారు. అక్కడేం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కొంత సమయానికి వాళ్లు నాకొక లెటర్‌ ఇచ్చారు. లెటర్‌ పూర్తిగా చదవలేదు. మేడమ్‌ టుస్సాడ్స్‌ అని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యా. నా మైనపు విగ్రహం చూడగానే సంతోషంగా అనిపించింది. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. హెయిర్‌ పార్ట్‌ అద్భుతంగా కుదిరింది. నాకు సంబంధించిన మోస్ట్‌ ఐకానిక్‌ పోజుల్లో తగ్గేదేలే పోజు ఒకటి’’ అని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని సందర్శించి తన విగ్రహంతో ఫొటోలు దిగాలని అందులో ఆయన కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Premalu on Ott: ‘మోడ్రన్‌ లవ్‌ ఫీస్ట్‌' ఎప్పుడు.. ఎక్కడంటే!



‘పుష్ప’తో (Pushpa 2) పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బన్ని. అంతే కాదు ఈ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ అందుకున్నారు. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత బన్నీతో సాధ్యమైంది.  ప్రస్తుతం ఆయన ‘పుష్ప-2’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. రష్మిక కథానాయిక. సుకుమార్‌ దర్శకుడు. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజును సందర్భంగా ‘పుష్ప ది రూల్‌’ టీజర్‌ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - Apr 07 , 2024 | 03:59 PM