Pushpa 2: అల్లు అర్జున్ చేసిన పని 'పుష్ప 2' పై ప్రభావం చూపిస్తుందా?

ABN , Publish Date - May 18 , 2024 | 03:43 PM

నాగబాబు చేసిన ఒక పోస్టుపై అల్లు అర్జున్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చెయ్యడం, నాగబాబు 'ఎక్స్' నుండి తప్పుకోవటం, మళ్ళీ ఈరోజు 'ఎక్స్' లో ప్రత్యక్షమవటం ఇవన్నీ మెగా కుటుంబం వార్తల్లో ఉండేట్టు చేసింది. అయితే మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' విడుదల రోజు కోసం ఎదురుచూస్తున్నారని, నాగబాబుని ఎలా అయితే ట్రోల్ చేశారో, అంతకి మించి ఆ సినిమాపై నెగటివ్ ట్రోల్స్ చెయ్యాలని అనుకుంటున్నారని ఒక భోగట్టా

Pushpa 2: అల్లు అర్జున్ చేసిన పని  'పుష్ప 2' పై ప్రభావం చూపిస్తుందా?
A still from Pushpa

మెగా కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో వుంది. అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల నుండి పోటీ చేస్తున్న శిల్ప రవి రెడ్డి ఇంటికి నంద్యాల వెళ్లడం, అక్కడ తనని ఎవరూ పిలవలేదని, తనే తన స్నేహితుడి కోసం వచ్చానని చెప్పడం వివాదం అయింది. తన దగ్గరి బంధువు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా, ముందుగా తన స్నేహితుడు దగ్గరికి వెళ్లడంతో మెగా అభిమానులు కొంచెం ఖంగు తిన్నారు. అదీ కాకుండా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ని కలవటానికి వెళ్లినరోజే అర్జున్ కూడా తన పర్యటన పెట్టుకోవంతో ఈ వివాదం మరింత జటిలం అయింది. (Mega fans are waiting for Allu Arjun's film to release to show their strength)

nagababu.jpg

అక్కడితో అది సమసిపోతుంది అనుకున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక వివాదాస్పద ట్వీట్ 'ఎక్స్' లో పోస్ట్ చేశారు. అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందే అని అందరికి అర్థం అయింది. అలా పోస్ట్ చేసిన నాగబాబుని అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్ చెయ్యడంతో, నాగబాబు 'ఎక్స్' నుండి తప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు 'ఎక్స్' లో ప్రత్యక్షమయ్యారు. 'నేను నా ట్వీట్ ని డిలీట్ చేసాను' అని పోస్ట్ కూడా పెట్టారు.

ఈ పోస్టుపైన కూడా ట్రోలింగ్ నడుస్తోంది. నెటిజన్స్ కొందరు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా, కొందరు నాగబాబు కి సపోర్ట్ గా కిందని కామెంట్స్ పెడుతున్నారు. ఏమైనా కూడా మళ్ళీ నాగబాబు 'ఎక్స్' లోకి రావటం, ఇంకో వివాదాస్పద పోస్ట్ పెట్టడంతో కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య అంతరం ఇంకా చెరిగిపోలేదు, దూరం అవుతోంది అని కూడా అంటున్నారు. (The recent controversy of Allu Arjun, Nagababu and the Mega Family, may impact Allu Arjun starrer Pushpa 2)

alluarjunpushpa2.jpg

అయితే మరి ఇది ఇక్కడితో ఆగిపోతుందా, లేక ఈ వివాదాన్ని ముందుకు తీసుకువెళతారా అనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా ఈ ఆగస్టు 15న విడుదలవుతోంది. మరి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సైలెంట్ గా ఊరుకుంటారా, వాళ్ళు కూడా ఆ సమయంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' గురించి నెగటివ్ కామెంట్స్ చేసే అవకాశం వుంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు నాగబాబుని ట్రోల్ చేశారు, వాళ్ళు కూడా అల్లు ర్జున్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు అని కొందరు అంటున్నారు. (Mega fans are waiting for thier turn to troll Allu Arjun as his film Pushpa 2 is releasing on August 15)

'పుష్ప 2' అల్లు అర్జున్ కెరీర్ లో ఒక కీలక సినిమా ని చెప్పొచ్చు. ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు, అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్, ఓటిటి, డిజిటల్ హక్కుల కోసం విపరీతమైన క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయకురాలిగా నటిస్తోంది.

Updated Date - May 18 , 2024 | 03:43 PM