Mega Family: ట్వీట్ ని డిలీట్ చేశానంటూ మళ్ళీ యాక్టివేట్ అయిన నాగబాబు

ABN , Publish Date - May 18 , 2024 | 12:19 PM

అల్లు అర్జున్ ని ఉద్దేశించి 'ఎక్స్' లో నాగబాబు పెట్టిన పోస్టుకి అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానితో నాగబాబు 'ఎక్స్' నుండి తన అకౌంట్ ని డిలీట్ చేసేశారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో వివాదాస్పదమైన పోస్టుతో యాక్టివేట్ అయ్యారు

Mega Family: ట్వీట్ ని డిలీట్ చేశానంటూ మళ్ళీ యాక్టివేట్ అయిన నాగబాబు
Nagababu is back on his 'X' account with another interesting post

మెగా కుటుంబం కొన్ని రోజుల నుండి వార్తల్లో ఉంటూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైస్సార్సీపీ పై పోటీ చేస్తున్న రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఆలా చేసినందుకు అల్లు అర్జున్ విమర్శకులకు గురయ్యాడు. ఆ తరువాత మెగా బ్రదర్ నాగబాబు తన 'ఎక్స్' లో ఒక పోస్ట్ పెట్టారు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!," అనూ పోస్ట్ చేశాక, అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టినదే అని అందరూ అనుకున్నారు.

Pawan-And-Nagababu.jpg

అయితే ఆ పోస్ట్ పెట్టిన తరువాత అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో వున్న అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే నాగబాబు తన 'ఎక్స్' అకౌంట్ ని డిలీట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తన 'ఎక్స్' అకౌంట్ ని యాక్టివేట్ చేశారు, చేసిన తరువాత పెట్టిన పోస్టు కూడా కొంచెం వివాదంగానే వుంది.

nagababutweet.jpg

"నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను", అంటూ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. అంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ ను ఉద్దేశించి పెట్టిన పోస్టును డిలీట్ చేశాను అని అర్ధమా? అని ఒక చర్చ నడుస్తోంది. అలా పోస్టు పెట్టినందువలన అతను మొత్తం 'ఎక్స్' నుండి తప్పుకోవాల్సి వచ్చిందా? అనేది కూడా ఇంకో టాక్ నడుస్తోంది.

ఇంతకీ నాగబాబు తాను 'ఎక్స్' నుండి ఎందుకు తప్పుకున్నట్టు? ఎవరైనా సలహా ఇచ్చారా? లేక అతనే తప్పుకున్నారా? మళ్ళీ ఎందుకు యాక్టివేట్ అయ్యారు? ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ అభిమానులు ఊరుకుంటారా? మళ్ళీ ట్రోల్ చెయ్యరా? లేక అల్లు అర్జున్ తో నాగబాబు మాట్లాడారా? ఇవన్నీ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది.

Updated Date - May 18 , 2024 | 12:24 PM