Jithender Reddy: విరించి వర్మ ‘జితేందర్ రెడ్డి’ విడుదల తేదీ ఫిక్సయింది

ABN , Publish Date - Mar 30 , 2024 | 09:33 PM

ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌‌‌పై విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేష్ వర్రే ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను 3 మే 2024న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

Jithender Reddy: విరించి వర్మ ‘జితేందర్ రెడ్డి’ విడుదల తేదీ ఫిక్సయింది
Jithender Reddy Movie Stills

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేష్ వర్రే (Rakesh Varre), గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆయన నిర్మాతగా చేస్తున్న ‘పేకమేడలు’ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఆయన హీరోగా చేస్తున్న ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) చిత్ర విడుదల తేదీతో మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి? అని హీరో ఫేస్ రివీల్ చేయకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాను 3 మే 2024న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు. ముదుగంటి క్రియేషన్స్ (Muduganti Creations) బ్యానర్‌‌‌పై విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వంలో ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Rakesh-Varre.jpg

రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా దర్శకుడు విరించి వర్మ (Director Virinchi Varma) మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరోగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా చేయడం చాలా గొప్ప విషయం. ఈ ‘జితేందర్ రెడ్డి’ జగిత్యాలలో 1980లలో జరిగిన యదార్ధ కథ. రియల్ స్టొరీని తెరకెక్కించడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది. దీని కోసం నేను, మా టీం వర్కౌట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్‌గా ఈ సినిమాను చేశాం. మే 3న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.


Virinchi-Varma.jpg

నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి (Muduganti Ravindhar Reddy) మాట్లాడుతూ.. ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ.. ‘జితేందర్ రెడ్డి’తో యాక్షన్ డైరెక్టర్‌గా మారుతున్నారు. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ ‘జితేందర్ రెడ్డి’. రాకేష్ వర్రే గతంలో లవ్ స్టోరీ చేశాడు.. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా విజృంభించేశాడు. తన సినిమాలే మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ‘జితేందర్ రెడ్డి’ని తన సొంత ప్రాజెక్ట్ లాగా, తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు. ఈ సినిమా ఎవరినీ కించ పరిచేలా ఉండదు. ఇకపై ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌తో ప్రేక్షకులకు టచ్‌లోనే ఉంటామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

***********************

Updated Date - Mar 30 , 2024 | 09:33 PM