Ajay Devgn: 'రైడ్' సీక్వెల్ ప్రారంభం, టాలీవుడ్ నటుడికి ఆహ్వానం

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:46 PM

అజయ్ దేవగన్ హిందీ సినిమా 'రైడ్ 2' ప్రారంభం అయింది. 'రైడ్' లో ఆదాయపు పన్నుశాఖ అధికారి అమయ్ పట్నాయక్‌గా చేసిన అజయ్ ఈ సీక్వెల్ లో ఇంకో నిజమైన కథతో వస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ నటుడు రవితేజని ఆహ్వానించారు.

Ajay Devgn: 'రైడ్' సీక్వెల్ ప్రారంభం, టాలీవుడ్ నటుడికి ఆహ్వానం
Ajay Devgn as Amay Patnaik in the Raid

అజయ్ దేవగన్ (Ajay Devgn), ఇలియానా (Ileana) నటించిన 'రైడ్' #Raid సినిమా 2018లో ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే అజయ్ దేవగన్ IRS ఆఫీసర్ అమయ్ పట్నాయక్‌గా నటించి అందరినీ మెప్పించారు. ఆ సినిమా నేపధ్యం ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా నిర్మించింది అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ అజయ్ దేవగన్ అమ్మాయి పట్నాయక్ గా మళ్ళీ రాబోతున్నాడు. ఆ 'రైడ్' సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'రైడ్ 2' #Raid2 సినిమా షూటింగ్ మొదలైంది.

దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా, నిర్మాతలు భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్‌ లు ఈ 'రైడ్ 2' కోసం మళ్ళీ కలుస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలైన సందర్బంగా ఒక అధికారిక మీడియా ఈ ప్రకటన కూడా విడుదల చేశారు, అందులో అజయ్ అభిమానులను శుభవార్త చెపుతూ, ఈ సీక్వెల్ ఈ సంవత్సరం నవంబర్ 15న విడుదల చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. ఇంకా, ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళుతున్నట్లు చిత్ర నిర్వాహకులు వెల్లడించారు, అలాగే ఇది మొదటి సినిమా కన్నా ఇంకా అంచనాలను పెంచుతుంది అని కూడా భావిస్తున్నారు.

ravitejaharishshankar.jpg

ఆదాయపు పన్ను శాఖలో కొంతమంది నిజాయితీ పరులైన ఆఫీసర్స్ వుంటారు, వాళ్ళు ప్రపంచానికి అంతగా తెలియకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళ కథలని ఈ 'రైడ్ 2' కోసం ఒక నిజమైన కేసుతో కథని తయారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు, కానీ అందులో అజయ్ దేవగన్ మొహం అయితే చూపించలేదు, కానీ “నిరీక్షణ ముగిసింది! #Raid2లో IRS ఆఫీసర్ అమయ్ పట్నాయక్‌గా అజయ్ దేవగన్ తిరిగి వచ్చారు" అని చెపుతూ నవంబర్ 15, 2024న మరో నిజమైన కేసును పెద్ద తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రకటించారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి తెలుగు నటుడు రవితేజ ని కూడా ఆహ్వానించారు. అందుకే రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఒక స్పెషల్ విమానంలో ముంబై వెళ్లారు. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో సినిమా 'మిష్టర్ బచ్చన్' ఈమధ్యనే షూటింగ్ ప్రారంభం అయింది. ఇది 'రైడ్' సినిమాకి రీమేక్ అని అంటున్నారు. అందుకే ఈ తెలుగు సినిమా చిత్ర నిర్వాహకులు అజయ్ దేవగన్ హిందీ సినిమా ప్రారంభానికి వెళ్లినట్టుగా తెలిసింది.

Updated Date - Jan 06 , 2024 | 05:46 PM