Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-08-19T12:51:59+05:30 IST

ప్రస్తుతం సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. దీని చికిత్స నిమిత్తం ఆమె తరచూ అమెరికా వెళ్లి వస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన ‘ఖుషి’ మ్యూజికల్ కన్సెర్ట్ అనంతరం హడావుడిగా సమంత అమెరికాకు పయనమైంది. అమెరికాలో ఆమె ల్యాండైన ఫొటోలు కనిపించడంతో అంతా చికిత్స కోసం వెళ్లిందని అనుకుంటున్నారు.. కానీ ఆమె 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌‌లో పాల్గొనేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?
Samantha

ప్రస్తుతం సమంత ‘మయోసైటిస్’ (Myositis) అనే వ్యాధితో ఇబ్బంది పడుతోంది. దీని చికిత్స నిమిత్తం ఆమె తరచూ అమెరికా వెళ్లి వస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన ‘ఖుషి’ మ్యూజికల్ కన్సెర్ట్ (Kushi Musical Concert) అనంతరం హడావుడిగా సమంత (Samantha) అమెరికాకు పయనమైంది. అయితే ఈసారి ఆమె అమెరికా వెళ్లింది చికిత్స నిమిత్తం అయితే కాదని తెలుస్తోంది. మరెందుకని అనుకుంటున్నారా? అమెరికా నుంచి ఆమెకు అరుదైన పిలుపు వచ్చింది. అందుకే వెంటనే పయనమైంది.


ఏమిటా అరుదైన పిలుపు అంటే.. ఇంతకు ముందు రానా (Rana), తమన్నా (Tamannaah), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)కి దక్కిన అరుదైన పిలుపును.. ఇప్పుడు సమంత కూడా సొంతం చేసుకోబోతోంది. ఈ ఏడాది న్యూయార్క్‌లో (New York) జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సమంత పాల్గొనబోతోంది. ఈ వరల్డ్ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్‌లో పాల్గొనే ఆహ్వానం సమంతకు వచ్చిందని తెలుస్తోంది. ఆగస్ట్ 20న జరిగే 41వ వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్‌ (41st India Day Parade)కి సమంతకు ఆహ్వానం అందడంతో వెంటనే ఆమె ‘ఖుషి’ ప్రమోషన్స్ ముగించుకుని అమెరికాకు పయనమైందట. ఈ విషయం తెలియక కొందరు.. ఆమె ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లిందని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సమంతతో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ కూడా పాల్గొనబోతున్నట్లుగా సమాచారం.

Samantha.jpg

వాస్తవానికి న్యూయార్క్‌లో అత్యంత వైభవంగా జరిగే ఇండియా డే పరేడ్‌ వేడుకకు సినీ తారలకు అరుదుగా ఆహ్వానం వస్తుంటుంది. 2022లో అల్లు అర్జున్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అలాగే ‘బాహుబలి’ (Bahubali) టైమ్‌లో రానా, తమన్నాలకు కూడా ఈ అవకాశం వరించింది. ఇప్పుడు సమంతకు ఆ గౌరవం దక్కింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా సెప్టెంబర్ 1న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. మరోవైపు ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది. రీసెంట్‌గా కొన్నాళ్లపాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమంత అధికారికంగా ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..

***************************************

*Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు

****************************************

*Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం

***************************************

*Bheemadevarapally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి..

***************************************

Updated Date - 2023-08-19T13:00:27+05:30 IST