JD Chakravarthy: రంభ తొడలు చూడటానికి నేను చక్రి అర్థరాత్రి వెళ్లాం: ఉత్తేజ్

ABN , First Publish Date - 2023-07-16T13:54:53+05:30 IST

జెడి చక్రవర్తి ఇప్పుడు 'దయా' అనే వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి అడుగుపెడుతున్నాడు. పవన్ సాధినేని దీనికి దర్శకుడు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 న విడుదల అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో జెడి స్నేహితుడు ఉత్తేజ్ కూడా వున్నాడు, అతను జెడి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు చెప్పాడు. అవేంటి అంటే...

JD Chakravarthy: రంభ తొడలు చూడటానికి నేను చక్రి అర్థరాత్రి వెళ్లాం: ఉత్తేజ్
JD Chakravarthy and Uttej at the Dayaa trailer release event

'దయా' #Dayaa వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ తో ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి (JDChakravarthy) ఓటిటి లోకి కూడా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో ఆగష్టు 4 న విడుదల అవుతోంది. పవన్ సాధినేని (PavanSadhineni) దీనికి దర్శకుడు. ఈ ట్రైలర్ విడుదల ఫంక్షన్ కి ప్రముఖ దర్శకుడు, జెడి స్నేహితుడు కృష్ణవంశి (KrishnaVamsi) ప్రత్యేక అతిధిగా వచ్చారు. అలాగే ఈ 'దయా' #DayaWebSeries వెబ్ సిరీస్ లో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా హాజరయ్యారు.

ఈ వెబ్ సిరీస్ కి ప్రత్యేక అతిధిగా వచ్చిన నటుడు ఉత్తేజ్ (Uttej), జెడి సినిమాల్లోకి రాకముందు నుండీ మంచి మిత్రులు. ఉత్తేజ్ మాట్లాడుతూ ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది, అలాగే చక్రి నాకు మంచి స్నేహితుడు అని చెపుతూ, "ఇద్దరం కలిసి పంజాగుట్ట దగ్గర ఒక అర్థరాత్రి రంభ (Rambha) తొడలు చూడటానికి వెళ్లిన బ్యాచ్," అన్నాడు. అక్కడ రంభ కట్ అవుట్ పెద్దది ఉంటే చూసి, 'అబ్బా ఏముందిరా రంభ' అని ఇద్దరం కారులో వెళ్లి చూసొచ్చాం.

jdchakravarthy1.jpg

అటువంటి జెడి అదే రంభతో ఒక సినిమాలో హీరో గా చేసాడు, అని జెడి గురించి చెప్పాడు ఉత్తేజ్. "వాడికి సినిమా తప్పితే ఇంకేమి తెలియదు. ఏ సినిమా గురించి అడగండి, ఆ సినిమా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఎవరు అని నిద్రలో అడిగినా చెప్పేస్తాడు, సినిమా గురించి వాడికి అంత నాలెడ్జి వుంది. బొంబాయి వెళ్లి 'సత్య' #Satya చేసినా, హైద్రాబాదులో 'బొంబాయి ప్రియుడు' #BombayiPriyudu చేసినా, వాడికి సినిమా తప్ప ఇంకేమి తెలియదు," అని చెప్పాడు ఉత్తేజ్ తన స్నేహితుడు గురించి.

కృష్ణవంశి 'గులాబీ' #Gulabi సినిమా ద్వారా చక్రిని హీరో గా పరిచయం చెయ్యటం, అదే కృష్ణవంశి ఈ 'దయా' వెబ్ సిరీస్ కి రావటం అంతా చాలా బాగుంది అని చెప్పాడు. ఈపాటికి చాలా పెద్ద హీరో అయ్యి ఎక్కడో ఉండాల్సిన వాడు చక్రి, కానీ మధ్యలో దర్శకత్వం అని ఎదో కొంచెం అటు వెళ్ళాడు. ఈలోపు చాలామంది వచ్చేసారు, అయినా వీరందరికీ ఫుడ్ పెట్టిన వాడు అవుతాడు చక్రి, అని చెప్పాడు ఉత్తేజ్. ఈ 'దయా' వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బ (EeshaRebba), విష్ణుప్రియ (VishnuPriya) ఇద్దరూ ప్రాముఖ్యం వున్న పాత్రలు వేశారు.

Updated Date - 2023-07-16T14:09:14+05:30 IST