SSMB29: మహేశ్‌ కోసం ముగ్గురు స్టార్లు.. ఎవరు ఫైనల్‌ అవుతారో!

ABN , First Publish Date - 2023-04-08T19:20:46+05:30 IST

మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్‌ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కలయికలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ సెట్‌ అయింది.

SSMB29: మహేశ్‌ కోసం ముగ్గురు స్టార్లు.. ఎవరు ఫైనల్‌ అవుతారో!

మహేశ్‌బాబు(Maheshbabu) - రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కలయికలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’(SSMB29) సెట్‌ అయింది. అయితే సినిమాను ప్రకటించి చాలా కాలం అయినా కథ, చిత్రీకరణ విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ఈ సినిమా లైన్‌ మాత్రం రాజమౌళి బయటకు వదిలారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని హింట్‌ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం మహేశ్‌ త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ (SSMB28) చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోపు రాజమౌళి(SS Rajamouli) ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ కథ ప్రీ పొడక్షన్‌ పనులు పూర్తి చేస్తారని సమాచారం.

5.jpg

ఆ ముగ్గురిలో ఎవరు? (three superstars for SSMB29)

అయితే ఈ సినిమా గురించి మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఇద్దరు తమిళ సూపర్‌స్టార్‌లను, ఓ మలయాళ స్టార్‌ను సంప్రదించారట. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విశ్వనాయకుడు కమల్‌హాసన్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు ఆరు నెలలుగా వార్తలొస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. కమల్‌హాసన్‌ (malahaasan)కాకుండా తమిళం నుంచి చియాన్‌ విక్రమ్‌ను(Chiyaan Vikram), మలయాళం నుంచి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Pruthviraj sukumaran)ను అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో, మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ పేజీల్లో ట్రెండ్‌ అవుతోంది. కమల్‌హాసన్‌, విక్రమ్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ ముగ్గురుకి ఈ చిత్రంలో ఛాన్‌ ఉందా? లేక ముగ్గురిలో ఒకర్ని సెలెక్ట్‌ చేస్తారా అన్నది చూడాలి. రాజమౌళి బుర్రలో ముగ్గురు స్టార్ల పేర్లు ఉన్నాయంటే అవి సినిమాకు కీలకమైన పాత్రలే అయుండొచ్చు. మరి జక్కన మైండ్‌లో ఏముందో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. ఆయన ఏ పాత్ర క్రియేట్‌ చేసినా దానితో మ్యాజిక్‌ అయితే ఉంటుంది. అదేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.

Untitled-2.jpg

మహేశ్‌కు అదిరిపోయే కౌంటర్‌!

దీంతోపాటు రెండ్రోజులు ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’కు సంబంధించి మరో విషయం ట్రోల్‌ అవుతోంది. రాజమౌళి, మహేశ్‌లపూ మీమర్స్‌ ఓ ఆసక్తికర మీమ్‌ తయారు చేశారు. రాజమౌళి - మహేశ్‌ డీప్‌ డిస్కర్షన్‌లో ఉన్న ఫొటో తీసుకుని ‘ఎస్‌ఎస్‌ఎంబీ’ ఏడాదిన్నరలో పూర్తయిపోతుందిగా అని మహేశ్‌ అడుగుతుంటే... ‘మీరు ఫ్యామిలీ టూర్లు మానేస్తే త్వరగా పూర్తి చేసేద్దాం’ అని జక్కన్న సమాధానం ఇచ్చినట్లు ఆ మీమ్‌లో ఉంది. ఈ మీమ్‌ చూసిన ఫ్యాన్స్‌ రాజమౌళి భలే పంచ్‌ వేశారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-04-08T19:40:40+05:30 IST