Samantha: షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత, ఆ వ్యాధి గురించి ఏమి చెప్పిందంటే..

ABN , First Publish Date - 2023-06-15T18:13:14+05:30 IST

జీవితంలో ఏదైనా ఒక చేదు అనుభవం ఎదురైతే దాన్నే పట్టుకొని కూర్చుకుండా బలంగా ఎదిగి ముందుకు సాగాలి అని అంటున్న సమంత, ఎందుకో గత సంవత్సరం జరిగిన సంఘటనను ఇంకా మర్చిపోలేక ఆ సంఘటన గురించే ఆలోచిస్తూ పోస్ట్ పెట్టడం ఆసక్తికరం.

Samantha: షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత, ఆ వ్యాధి గురించి ఏమి చెప్పిందంటే..
Samantha

సమంత (Samantha) మయోసిటిస్ (Myositis) వ్యాధినుండి కోలుకొని మళ్ళీ ఇప్పుడు షూటింగ్ లో బిజీగా వుంది. విజయ్ దేవరకొండ (VijayaDeverakonda) పక్కన 'ఖుషి' (Khushi) సినిమాషూటింగ్ చేస్తోంది. అలాగే ఇంకో పక్క 'సిటాడెల్' (Citadel) హిందీ వెబ్ సిరీస్ కూడా షూటింగ్ చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ (VarunDhawan) కథానాయకుడు. ఇలా ఈ రెండింటితో మళ్ళీ మామూలుగానే షూటింగ్ చేసుకుంటోంది.

samantha-citadel1.jpg

ఇదిలా ఉంటే, సమంత #Samantha తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. చాలా సుదీర్ఘమైన, భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. అందులో సారాంశం టూకీగా చెప్పాలంటే, ఆమెకి ఆ వింతైన వ్యాధి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఆమె ఏమి చేసింది, ఎన్ని గుళ్లు, గోపురాలు తిరిగింది, మందులు ఎలా వాడిందీ, అలాగే ఆత్మపరిశీలన చేసుకోవటం లాంటివి అన్నీపోస్ట్ చేసింది.

samantha-new3.jpg

వీటన్నితో పాటు 'శాకుంతలం' #Shakuntalam సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. దాని గురించి కూడా అందులో రాసింది. అలాగే ఆ వైఫల్యాల వలన, వ్యాధి వలన కృశించిపోకుండా బలం కోసం ప్రార్థనలు చెయ్యడం, ప్రేమించే వ్యక్తులను దగ్గర ఉంచుకోవటం, ప్రభావితం చేసే ఎటువంటి శక్తిని అయినా దూరం చేసుకోకుండా ఉండటం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళింది. అలాగే ఎదో అయిపోయిందని గొణుక్కుంటూ కూర్చోకుండా ఎలా ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి అనే ఆలోచనలతో సాగుతూ పోవాలి అనే విషయాలు పెట్టింది.

ఇన్ని చెపుతున్న సమంత ఇంకా ఆ వ్యాధి గురించి మరిచిపోకుండా ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఈ పోస్ట్ పెట్టడం ఆసక్తికరం. ఎందుకంటే మామూలుగా నెగటివిటీ ని దూరం పెట్టాలి, ఏదైనా మంచి జరిగితే దాని గురించి చెప్పుకోవాలి, చెడును వదిలేయాలి. కానీ సమంత ఇంకా ఆ మయోసిటిస్ వ్యాధి గురించే ఆలోచిస్తూ, వచ్చి ఒక ఏడాది అయింది అని పోస్ట్ పెట్టడం ఆసక్తికరం.

Updated Date - 2023-06-15T18:13:14+05:30 IST