Rajinikanth: స్నేహితుడిని కోల్పోయా... ఎన్నోసార్లు మందలించారు

ABN , First Publish Date - 2023-05-23T15:34:36+05:30 IST

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు శరత్‌బాబు సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే! అభిమానుల సందర్శనార్ధం సోమవారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకూ శరత్‌బాబు భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచారు.

Rajinikanth: స్నేహితుడిని కోల్పోయా... ఎన్నోసార్లు మందలించారు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు శరత్‌బాబు (Sarathbabu) సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే! అభిమానుల సందర్శనార్ధం సోమవారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకూ శరత్‌బాబు (RIP Sarath Babu) భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచారు. తదుపరి చెన్నైకు తరలించారు. ఆయన్ను కడసారి చూసేందుకు చెన్నైలోని ఆయన నివాసానికి సినీ తారలు, అభిమానులు తరలి వచ్చారు. రజనీకాంత్‌, సుహాసిని, రాధిక, శరత్‌కుమార్‌, సూర్య, రాంగోపాల్‌ వర్మ ఇలా పలువురు తారలు శరత్‌బాబు పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరంరజినీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘శరత్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (Rajinikanth)

‘‘శరత్‌బాబుతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. నటుడు కాకముందు నుంచే ఆయన తెలుసు. సున్నిత స్వభావం కలవారు. మంచి వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేవారు. ఇన్నేళ్ల జర్నీలో ఆయనలో కోపం చూడలేదు. మేమిద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించాం. ఆయనకు నేను అంటే ఎంతో ఇష్టం. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించేవారు. ఓ సందర్భంలో నేను సిగరెట్‌ కాల్చడం చూసి.. మానేయమంటూ నన్ను మందలించారు. మంచి మిత్రుణ్ణి కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నా’’ అని రజినీకాంత్‌ అన్నారు. సోమవారం సాయంత్రం శరత్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ నటి సుహాసిని పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-05-23T15:34:36+05:30 IST