Anasuya: ఏమి మాట్లాడినా ఏమి అర్థాలు తీస్తారో మరి...

ABN , First Publish Date - 2023-09-11T18:00:11+05:30 IST

ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఏదైనా సినిమా ప్రచారానికి వస్తోంది అంటే చాలు అందరి చూపులు ఆమె మీదే ఉంటాయి. ఎందుకంటే ఆమె ఏమి మాట్లాడుతుంది, ఎటువంటి వివాదం మళ్ళీ ఏదైనా లేవనెత్తుతుందా అని, ఈసారి 'పెదకాపు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఏమి జరిగింది అంటే...

Anasuya: ఏమి మాట్లాడినా ఏమి అర్థాలు తీస్తారో మరి...
Anasuya

ప్రముఖ యాంకర్, నటి అనసూయ (Anasuya) ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఒక్క సాంఘీక మాధ్యమంలోనే కాదు, ఆమె ఏదైనా ఆమె సినిమా ప్రచారానికి వచ్చినా అది కూడా ఒక్కోసారి వార్త అయిపోతూ ఉంటుంది. అందుకే ఆమె ఏమి మాట్లాడినా జాగర్తగా మాట్లాడాలి, లేదంటే ఏదైనా రాసేస్తారు అనుకుంటుంది. ఆమె వివాదం మాట్లాడితే, వివాదం అవుతుంది, మామూలుగా మాట్లాడితే అది సినిమా గురించి మాట్లాడింది అనసూయ అని అంటారు.

ఈరోజు 'పెదకాపు 1' #PeddhaKapu1 సినిమా ప్రచారంలో భాగంగా ఆ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) దర్శకుడు కాగా మిర్యాల రవీందర్ రెడ్డి (MiryalaRavinderReddy) నిర్మాత. ఈ సినిమాలో అనసూయ ఒక ప్రముఖ పాత్ర పోషించింది. అందరూ ఈ సినిమాలో అనసూయ చేసిన పాత్రకి గాను, ఆమె ఇంతకు ముందు 'రంగస్థలం'లో #Rangasthalam చేసిన రంగమ్మత్త (Rangamatha) పాత్రకి ఎంత పేరు వచ్చిందో, అంతకన్నా ఎక్కువ పేరు వస్తుంది అని అన్నారు.

anasuya-new2.jpg

ఆమె ఈ సినిమా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందొ అందరిలానే నేను కూడా ఈరోజు చూడాలి అనుకున్నాను, చూసాను. చాలా సంతోషంగా వుంది, ఈ సినిమాలో భాగం అయినందుకు, అంత మంచి పాత్ర దర్శకుడు తనకి ఇచ్చినందుకు అని చెప్పింది. ఆలా అంటూనే "ఏమి మాట్లాడాలన్నా చాలా టెన్షన్ గా వుంది, ఏమి మాట్లాడినా ఏమి అర్థాలు తీస్తారో అని' కూడా అంది. సినిమా గురించి మాట్లాడితే, అదే రాస్తారు, వివాదాలు గురించి మాట్లాడితే వాటి గురించే రాస్తారు, అంతే కానీ వేరే ఎందుకు రాస్తారో మరి ఆమె ఎందుకు ఆలా అన్నదో ఆమెకే తెలియాలి.

ఈ సినిమా చేసే ముందు సినిమాటోగ్రఫర్ చోట కె నాయుడు (ChotaKNaidu) అనసూయకి ఫోన్ చేసి 'నీకు ఒక నీకు ఒక ఫోను వస్తది పిచ్చి వేషాలు వెయ్యకుండా విను' అని చెప్పారట. అప్పుడు ఈ చిత్ర దర్శకుడు ఫోన్ చేసి చెప్పారట, ఆలా ఈ సినిమా ఒప్పుకుంది అనసూయ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-09-11T18:00:11+05:30 IST