Namrata Shirodkar : వారి చిరునవ్వు చూసి ఆనందిస్తాడు

ABN , First Publish Date - 2023-08-29T15:50:29+05:30 IST

గౌతమ్‌ను (goutham krishna) చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమ్రతా శిరోద్కర్‌(namratha) మహేశ్‌బాబు ఫౌండేషన్‌ (MB Foundation) ద్వారా ఇప్పటికే ఎంతోమంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి తమ మంచి మనసు చాటుకున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆయన కుమారుడు గౌతమ్‌ కూడా అదే బాటలో వెళుతున్నాడు.

Namrata Shirodkar : వారి చిరునవ్వు చూసి ఆనందిస్తాడు

గౌతమ్‌ను (goutham krishna) చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమ్రతా శిరోద్కర్‌(namratha) మహేశ్‌బాబు ఫౌండేషన్‌ (MB Foundation) ద్వారా ఇప్పటికే ఎంతోమంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి తమ మంచి మనసు చాటుకున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆయన కుమారుడు గౌతమ్‌ కూడా అదే బాటలో వెళుతున్నాడు. తాజాగా గుండె ఆపరేషన్‌ చేయించుకున్న చిన్నారులను ఆసుపత్రికి వెళ్లి పలకరించాడు. వాళ్లలో మనోధైర్యాన్ని నింపుతున్నాడు. సంబంధిత ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి భావోద్వేగానిరి లోనయ్యారు నమ్రత. ఈ మేరకు ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. చికిత్స తీసుకుంటున్న ఓ చిన్నారితో గౌతమ్‌ ఉన్న ఫొటోను నమ్రత షేర్‌ చేశారు. ఆపరేషన్‌ చేయించుకున్న చిన్నారులను కలవడానికి గౌతమ్‌ రెయిన్‌బో ఆసుపత్రికి వెళ్తుంటాడని నమ్రత చెప్పారు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులకు మహేశ్‌ ఫౌండేషన్‌ పేరుతో గుండె ఆపరేషన్లు చేయించినట్లు ఆమె తెలిపారు.

Untitled-1.jpg

‘ఎంబీ ఫౌండేషన్‌లో భాగమైన గౌతమ్‌.. చికిత్స తీసుకుంటున్న పిల్లలతో కలిసి సమయాన్ని గడుపుతాడు. క్యాన్సర్‌ బారిన పడిన పిల్ల్లల్లో గుండె ధైర్యాన్ని నింపుతాడు. వాళ్ల కోసం బహుమతులు తీసుకెళ్తాడు. ఇలా చేయడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకుంటుంటారు. అనారోగ్యం నుంచి కోలుకుని చిరునవ్వులను చిందించే ఆ చిన్నారులను చూసి తను ఎంతో ఆనందిస్తాడు. వాళ్లకు అండగా నిలుస్తున్నందుకు గౌతమ్‌కు ధన్యవాదాలు’’ అని నమ్రత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Updated Date - 2023-08-29T16:03:56+05:30 IST