Mega 157 : చిరు సరసన ఆ ఇద్దరు హీరోయిన్లు.. ఎవరు ఫైనల్‌ అవుతారో?

ABN , First Publish Date - 2023-09-09T12:01:23+05:30 IST

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట (Vasishta) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్న చిత్రమిది. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కథానాయికల వేటలో ఉన్నారు దర్శకనిర్మాతలు. అయితే చిరు సరసన పర్ఫెక్ట్‌గా సూటయ్యే హీరోయిన్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు.

Mega 157 : చిరు సరసన ఆ ఇద్దరు హీరోయిన్లు.. ఎవరు ఫైనల్‌ అవుతారో?

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ట (Vasishta) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్న చిత్రమిది. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే! ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరులో లేదా నవంబరు నెలలో సెట్స్‌ మీదకెళ్లనుంది. ప్రస్తుతం కథానాయికల వేటలో ఉన్నారు దర్శకనిర్మాతలు. అయితే చిరు సరసన పర్ఫెక్ట్‌గా సూటయ్యే హీరోయిన్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ తరుణంలో అనుష్క(Anushka), నయనతార (Nayantara) పేర్లతోపాటు బాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎవర్ని ఖరారు చేస్తారన్నది తెలియాల్సి ఉంది. (Mega 157)

అనుష్క.. నయనతార ఇద్దరూ ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తున్నారు. నయనతార ‘జవాన్‌’తో అదరగొడుతుంటే.. అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం వశిష్ఠ దృష్టిలో వీళ్లిద్దరూ ఉన్నారని తెలుస్తోంది. మరి ఎవరు ఫైనల్‌ అవుతారన్నది చూడాలి. ‘బింబిసార’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న వశిష్ఠ రెండో చిత్రంగా చిరుని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నాడు. మొదటి సినిమాను మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే సంక్పతంతో ఉన్నాడు.

Updated Date - 2023-09-09T12:01:51+05:30 IST