Chiranjeevi: యూఎస్‌ వాళ్లు ముందే చెప్పారు... మేమే పొరపాటు పడ్డాం

ABN , First Publish Date - 2023-01-23T18:18:05+05:30 IST

సంక్రాంతికి బరిలో చిరంజీవి హీరోగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ వంద కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే? రెండో వారంలో ఈ చిత్రం రూ. 165 కోట్ల వసూళ్లు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికీ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.

Chiranjeevi: యూఎస్‌ వాళ్లు ముందే చెప్పారు... మేమే పొరపాటు పడ్డాం

సంక్రాంతికి బరిలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంద కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే? రెండో వారంలో ఈ చిత్రం రూ. 165 కోట్ల వసూళ్లు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికీ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయితే పలు వెబ్‌సైట్లు ఇచ్చిన రేటింగ్‌ల పట్ల చిరంజీవి(Chiranjeevi counter on Reviews) పంచ్‌లు వేశారు. ఒకర్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ జోకులు వేయడం లేదని.. సరదాగానే చెబుతున్నానని ఆయన సెలవిచ్చారు.

1.jpg

‘‘వాల్తేరు వీరయ్య’ యూఎస్‌ ప్రీమియర్స్‌(Us primiers) చూసి ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్‌లో రివ్యూలు రాశారు. కొందరు బాగా రాస్తే కొందరు మాత్రం మా చిత్రానికి 2.5 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. వాటిని చూసి.. బాధపడకూడదని అనుకున్నాను. ఎందుకంటే సినిమా అవుట్‌పుట్‌పై మాకెంతో నమ్మకం ఉంది. ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ఘరానా మొగుడు’, ‘రౌడీ అల్ల్లుడు’, ‘అన్నయ్య’ చిత్రాల తర్వాత అలాంటి పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ ఇది. కాబట్టి రేటింగ్‌ను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా. ఆ తర్వాతే తెలిసింది 2.5 అంటే 2.5 మిలియన్ల డాలర్లు అని. అంత రెవెన్యూ వస్తుందని యూఎస్‌ వాళ్లు ముందే చెప్పారని.. మేమే పొరపాటు పడ్డాం అని తెలిసింది’’ అంటూ చిరంజీవి నవ్వులు పూయించారు. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న అభిమానులతో చిరంజీవి జూమ్‌ కాల్‌లో మాట్లాడారు. ఇంతటి విజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషించారు. కేథరిన్‌, శ్రుతిహాసన్‌ నాయికలు.

Updated Date - 2023-01-23T18:18:07+05:30 IST