MaheshBabu: 'గుంటూరు కారం' మళ్ళీ వాయిదా, అభిమానులు అసలు సినిమా వుంటుందా అని ఆందోళన

ABN , First Publish Date - 2023-06-12T12:20:08+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకి అడ్డంకులు ఇంకా తొలగిపోలేదు. ఈరోజు నుండి హైదరాబాద్ లో జరగాల్సిన షూటింగ్ మళ్ళీ వాయిదా పడింది. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదు అని అంటున్నారు, మహేష్ అభిమానులు అసలు ఈ సినిమా ఉంటుందా అని ఆందోళనలో వున్నారని తెలిసింది.

MaheshBabu: 'గుంటూరు కారం' మళ్ళీ వాయిదా, అభిమానులు అసలు సినిమా వుంటుందా అని ఆందోళన
Trivikram Srinivas and Mahesh Babu

మహేష్ బాబు (MaheshBabu), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GutunrKaram సినిమా షూటింగ్ మళ్ళీ పోస్టుపోన్ అయింది. ఈరోజు నుండి హైదరాబాద్ లో జరగాల్సిన షూటింగ్ వాయిదా వేస్తున్నట్టుగా నటీనటుల మేనేజర్ లకు, సాంకేతిక నిపుణలకు వర్తమానం వచ్చింది అని తెలిసింది. ముందు అనుకున్న దాని ప్రకారం జూన్ 9 నుండి అనుకున్నారు, కానీ ఆరోజు కూడా అవలేదు, జూన్ 12 కి పోస్టుపోన్ చేశారు, ఇప్పుడు ఇది కూడా పోస్టుపోన్ అయిపొయింది అని తెలిసింది. ఇంక ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలెడతారో తెలియక ఇందులో నటిస్తున్న ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు అయోమయంలో వున్నారని కూడా తెలిసింది.

maheshbabutrivikramfilm.jpg

ఒక పక్క ఇలా ఉంటే, మహేష్ బాబు అభిమానులు చాలా ఆందోళనగా వున్నారు. ఎందుకంటే ఈ సినిమా మొదలయ్యి సుమారు సంవత్సరం పైనే అయింది. కానీ ఇంతవరకు 10 శాతం సినిమా కూడా అవలేదు. ఇందులో మళ్ళీ పోరాట సన్నివేశాలు నచ్చలేదు, అవి మళ్ళీ షూటింగ్ చెయ్యాల్సి వుంది అన్న టాక్ కూడా నడుస్తోంది. అంటే సినిమా ఏవో నాలుగు అయిదు సన్నివేశాలు మాత్రమే ఇంతవరకు తీశారు అని తెలుస్తోంది.

ఇలా అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు, పూర్తి చేసేది ఎప్పుడు అని అభిమానులు ఆందోళనలో వున్నట్టుగా తెలిసింది. అలాగే పరిశ్రమలో కూడా మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అనగానే ఒక జోక్ ల అయిపోయిందని చర్చ నడుస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రకాష్ రాజ్ (PrakashRaj), రమ్యకృష్ణ (Ramyakrishna), రోహిణి (Rohini), జగపతి బాబు (JagapathiBabu), మురళి శర్మ (MuraliSharma), జయరాం (Jayaram), రావు రమేష్ (RaoRamesh), బ్రహ్మాజీ (Brahmaji), రఘుబాబు (Raghubabu) ఇంకా చాలామంది ఈ సినిమాలో వున్నారు, వాళ్లందరీ డేట్స్ ఈరోజు నుండి లాక్ చేశారు, కానీ తీరా షూటింగ్ వాయిదా పడింది అని తెలియగానే వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక లోలోపల మదన పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పారితోషికం ఇవ్వరు, ఈ సినిమాకి డేట్స్ ఇచ్చి అదే సమయంలో వేరే సినిమాలు వదులుకున్నారు, అందుకని కాళీగా ఉండాలి. అందుకని వాళ్ళు కూడా ఈ సినిమాలో మేము లేకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

MB-Trivikram.jpg

ఇవన్నీ ఇలా ఉంటే ఇందులో మహేష్ బాబు తల్లిగా కీల పాత్ర పోషిస్తున్న రమ్య కృష్ణ విదేశాలకు వెళుతున్నట్టుగా తెలిసింది. అలాగే మహేష్ బాబు జులై లో వెకేషన్ కి వెళ్లి మళ్ళీ ఆగస్టు 15 కి వస్తాడని, అంటే ఇప్పుడు షూటింగ్ అవకపోతే మళ్ళీ ఆగస్టు తరువాత మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. ఇలా అయితే అనుకున్నట్టుగా జనవరిలో సంక్రాంతి పండగకి ఈ సినిమా రావటం కష్టమే అని కూడా ఒక టాక్ పరిశ్రమలో వినపడుతోంది. పూజ హెగ్డే (PoojaHegde), శ్రీలీల (Sreeleela) ఇందులో కథానాయికలుగా వేస్తున్నారు.

Updated Date - 2023-06-14T10:03:16+05:30 IST