రామ్ రిలీజ్ చేసిన యూత్ఫుల్ సాంగ్
ABN , First Publish Date - 2022-05-26T06:39:17+05:30 IST
డిఫరెంట్ కాన్సెప్ట్తో 11: 11 చిత్రాన్ని నిర్మిస్తున్నారు గాజుల వీరేశ్. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు...
డిఫరెంట్ కాన్సెప్ట్తో 11: 11 చిత్రాన్ని నిర్మిస్తున్నారు గాజుల వీరేశ్. సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆర్ కె నల్లూరి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా హీరో రామ్ చేతుల మీదుగా ‘ఏమయిందో మనసైపోయే మాయం’ అంటూ సాగే యూత్ఫుల్ సాంగ్ను విడుదల చేశారు. రాజీవ్, వర్షలపై చిత్రీకరించిన ఈ పాటను రాకేందు మౌళి రాశారు. ప్రేయసికి తన మనసులోని మాటను హీరో వ్యక్తం చేసే పాట ఇది. సాంగ్ బాగుందని హీరో రామ్ యూనిట్ను అభినందించారు. సినిమా సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు. ప్రేమకథలో ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ను చేర్చడం ఈ సినిమా ప్రత్యేకత అని చిత్రబృందం చెప్పింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.