‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ చూసిన యంగ్ టైగర్ రియాక్షన్ ఇదే!
ABN , First Publish Date - 2022-01-09T00:05:28+05:30 IST
‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ను చూస్తుంటే ‘ప్రేమదేశం’ చూసిన ఎగ్జయిట్మెంట్ వచ్చిందని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న..
‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ను చూస్తుంటే ‘ప్రేమదేశం’ చూసిన ఎగ్జయిట్మెంట్ వచ్చిందని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఈ చిత్రంతో ఆశిష్(శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులకు ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇది నాకు నోస్టాలజిక్ డే. ఎందుకంటే ‘ఆది’ సినిమా సమయంలో దిల్ రాజుగారితో, శిరీష్గారితో అసోషియేషన్ ఏర్పడింది. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్తో అప్పటి వరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్కి, డైరెక్టర్ శ్రీహర్షకి అభినందనలు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి మంచి చిత్రాల్లో తను భాగం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.
కోవిడ్ సమయంలో విడుదలవుతున్న రౌడీ బాయ్స్ ఘన విజయం సాధించి.. మంచి చిత్రంగా మనకు గుర్తుండిపోవాలనుని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ‘ప్రేమదేశం’ చూసిన ఎగ్జయిట్మెంట్ వచ్చింది. నాకే కాదు. మీ అందరికీ కూడా అలాంటి ఎగ్జయిట్మెంట్ కలుగుతుందని మనసారా నమ్ముతున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తారనే నమ్మకం ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాను థియేటర్స్లోనే చూసి.. ‘రౌడీ బాయ్స్’కి ఘన విజయం అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.