రక్తంతో కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్ వేసిన మహిళ

ABN , First Publish Date - 2022-03-24T23:00:12+05:30 IST

కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ లేసింది. విపక్ష పార్టీలు, సమాజిక సంఘాల వారు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ చేయడం కూడా విమర్శలు..

రక్తంతో కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్ వేసిన మహిళ

ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని మంజు సోని మహిళ తన రక్తంతో గీసింది. కాగా, ఆమె గీసిన చిత్రం వైరల్ కావడంతో కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మంజు సోని గీసిన చిత్రాన్ని, ఆమె ఫొటోను షేర్ చేస్తూ ‘‘ఓ మై గాడ్.. నమ్మశక్యం కావడం లేదు. మంజు సోనికి ఎలా కృతజ్ణతలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఆమెకు నా ప్రణామాలు. ఈమె గురించి ఎవరికైనా తెలిస్తే ఆమె కాంటాక్ట్ ఒకసారి నాకు పంపించండి’’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌లో ‘రైట్ టూ జస్టిస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.


కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ లేసింది. విపక్ష పార్టీలు, సమాజిక సంఘాల వారు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ చేయడం కూడా విమర్శలు వస్తున్నాయి. కశ్మీరి నేతలు ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, గులాంనబీ ఆజాద్ లాంటి కశ్మీర్ నేతలు అయితే ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రజల మధ్య చీలికను మరింత తీవ్రతరం చేసే విధంగా సినిమా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2022-03-24T23:00:12+05:30 IST