ARYAN KHAN విడుదలకు... 25 కోట్లు!

ABN , First Publish Date - 2021-10-24T22:58:37+05:30 IST

ఆర్యన్ ఖాన్ను విడుదల చేయాలంటే 25 కోట్లు డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేయటం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. పైగా నేరుగా ఎన్సీబీనే టార్గెట్ చేశాడు సదరు స్వతంత్ర సాక్షి! ఇంతకీ అతనెవరంటే...

ARYAN KHAN విడుదలకు... 25 కోట్లు!

ఆర్యన్ ఖాన్ను విడుదల చేయాలంటే 25 కోట్లు డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేయటం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. పైగా నేరుగా ఎన్సీబీనే టార్గెట్ చేశాడు సదరు స్వతంత్ర సాక్షి! ఇంతకీ అతనెవరంటే... ముంబై క్రుయిజ్ డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవీకి, బాడీగార్డ్ అంటున్నారు. గోసవీని ఎన్సీబీ తన తరుఫున సాక్షిగా కోర్టు ముందుకు తీసుకు వస్తోంది. అయితే, అతనితో పాటూ సామ్ డిసౌజా అనే మరో వ్యక్తి షారుఖ్ నుంచీ 25 కోట్లు డిమాండ్ చేశారంటున్నాడు గోసవీ తాలూకూ బాడీగార్డ్. అతని వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాకున్నా, ఆయన చెబుతోన్న దాని ప్రకారం మాత్రం... ఎన్సీబీ అధికారులు, కేపీ గోసవీ కలసి కింగ్ ఖాన్ని కోట్లాది రూపాయలు అడిగారట!


ఆర్యన్ ఖాన్ విడుదల కోసం 25 కోట్లు డిమాండ్ చేయటం అబద్ధపు ఆరోపణ అంటున్నారు ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే. అయితే, తమపై వస్తోన్న కొత్త, కొత్త ఆరోపణల్ని ఖండిస్తోన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డ్రగ్స్ కేసులో తన పని తాను చేసుకుపోతోంది. ఆర్యన్ ఖాన్‌తో పాటూ ఇతర నిందితుల డిలీటెడ్ మెసేజెస్ తిరిగి రాబట్టేందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు అధికారులు. అలాగే, ఆర్యన్ ఖాన్ బ్యాంక్ లావాదేవీలు కూడా ఎన్సీబీ చెక్ చేయనుంది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఏమైనా ఖరీదు చేయటం జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.       

Updated Date - 2021-10-24T22:58:37+05:30 IST