అన్ని హంగులతో..
ABN , First Publish Date - 2022-08-16T05:41:21+05:30 IST
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తీస్మార్ఖాన్’. పాయల్ రాజ్పుత్ కథానాయిక. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో...
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తీస్మార్ఖాన్’. పాయల్ రాజ్పుత్ కథానాయిక. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రం. తిరుపతిరెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. అన్ని హంగులతో ప్రేక్షకుల ముందకొస్తున్నాం. మా సినిమాను ఆదరించాలి’ అని కోరారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘టీజర్, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు. కల్యాణ్ జి. గోగణ మాట్లాడుతూ ‘ప్రతి 15 నిమిషాలకు సినిమాలో వచ్చే మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఆకట్టుకుంటుంది’ అన్నారు. కబీర్ సింగ్, పూర్ణ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: బాల్రెడ్డి.