Mahesh కోసం మరో దర్శకుడు రెడీ..?
ABN , First Publish Date - 2022-06-25T19:04:39+05:30 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కోసం దర్శకుల క్యూ పెరిగిపోతోంది. ఇటీవలే ఆయన నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా వచ్చి నిరాశపరిచింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కోసం దర్శకుల క్యూ పెరిగిపోతోంది. ఇటీవలే ఆయన నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా వచ్చి నిరాశపరిచింది. దీని తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తన 28వ సినిమాను చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే, ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి మహేశ్ - త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
అయితే, ఈ సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియన్ మూవీకి రెడీ అవ్వాలని మహేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ ఇంకా మొదలవడానికి బాగానే సమయం పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే మహేశ్, రాజమౌళి సినిమా గనక డిలే అయితే.. వెంటనే మరో దర్శకుడితో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలని ప్లాన్గా ఉన్నారట. ఈ క్రమంలోనే సుకుమార్ (Sukumar), సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddi vanga)లతో సినిమాలు చేయాలని చర్చలు జరుపుతున్నారట.
సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ ఇంతకముందు 1 నేనొక్కడినే సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నారు. అయితే, మేకింగ్ పరంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సుక్కూ ఈసారి మహేశ్ ఛాన్స్ ఇస్తే భారీ హిట్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్ఠించిన సందీప్ రెడ్డి వంగ కూడా మహేశ్ డేట్స్ ఇస్తే సినిమా చేయాలని రెడీగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హిందీలో రణ్బీర్ కపూర్తో యానిమల్ సినిమాను చేస్తున్నారు. దీని అర్వాత ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రభాస్ డేట్స్ సర్దుబాటు కాకపోతే మహేశ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి మహేశ్ సుక్కూకి సై అంటారో లేదా సందీప్తో రెడీ అవుతారో.