రానున్న రోజుల్లో NTR పేరే వినిపిస్తుందా..!
ABN , First Publish Date - 2022-05-28T20:00:14+05:30 IST
‘బాహుబలి’(Bahubali) మూవీతో ప్రభాస్ (Prabhas), ‘పుష్ప ది రైజ్’ (Pushpa)తో అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్లుగా మారి భారీ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత `ఆర్ఆర్ఆర్` (RRR)తో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్..
‘బాహుబలి’(Bahubali) మూవీతో ప్రభాస్ (Prabhas), ‘పుష్ప ది రైజ్’ (Pushpa)తో అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్లుగా మారి భారీ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత `ఆర్ఆర్ఆర్` (RRR)తో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR).. ఇప్పుడు ప్రభాస్, బన్నీలనే మించిపోయాడు. ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతి ఏడాది పలు రంగాలకు చెందిన పాపులర్ స్టార్స్పై సర్వేలు చేస్తుంటుంది. తాజాగా మోస్ట్ లవ్డ్ పాన్ ఇండియా స్టార్స్ ఎవరు? అనే దానిపై సర్వే నిర్వహించి.. టాప్ 10 ర్యాంకింగ్స్ ఇచ్చారు. అయితే ఈ సర్వేలో రెండో స్థానాన్ని ఎన్టీఆర్ దక్కించుకున్నారు. అలాగే, టాప్ 1లో ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ నిలవడం విశేషం.
మూడో స్థానం ప్రభాస్ సొంతం చేసుకోగా.. అల్లు అర్జున్ టాప్ 4లో నిలిచాడు. ఆయన తర్వాత బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 5వ స్థానం పొందారు. బాలీవుడ్ నుండి ఒక్క అక్షయ్ కుమార్కు మాత్రమే లిస్ట్లో చోటు దక్కింది. మిగిలిన హీరోలందరూ సౌత్ హీరోల ముందు దిగదుడుపే.. అంటున్నారు. ఇక అజిత్ కుమార్, యశ్, రామ్ చరణ్, సూర్య, మహేశ్ బాబు.. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది మరియు పది స్థానాల్లో వరసగా నిలిచారు. మొత్తానికి టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ టాప్ ప్లేస్ను సొంతం చేసుకోవడంతో.. ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
ఇటివల బయటకి వచ్చిన మరో సర్వేలో కూడా ఎన్టీఆర్ మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్గా ఫస్ట్ ప్లేస్ని సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న తారక్కు అసలైన టైం ఇప్పుడే మొదలైంది. ఇకపై పాన్ ఇండియా మొత్తం ఆ పేరు వినిపిస్తుంది అంటూ నందమూరి ఫాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒక్క పాన్ ఇండియా సినిమాకే ఎన్టీఆర్ క్రేజ్ ఇలా ఉంటే.. రాబోయే ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 కూడా హిట్ అయితే... దేశం మొత్తం ఎన్టీఆర్ జపం చేస్తుందేమో చూడాలి.