Dhanush and Aishwarya: రూ.100 కోట్లతో ఇల్లు.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్న ధనుష్, ఐశ్వర్య?
ABN , First Publish Date - 2022-10-18T16:36:41+05:30 IST
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), ఆయన మాజీ సతీమణి ఐశ్వర్య (Aishwarya) సేపరేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే..
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), ఆయన మాజీ సతీమణి ఐశ్వర్య (Aishwarya) సేపరేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వీరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు విడాకుల వరకు దారి తీశాయి. జనవరి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా.. ఈ జంట మళ్లీ కలిసి పోయినట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరి భవిష్యత్ దృష్ట్యా ధనుష్ దంపతులను ఒక్కటి చేసేందుకు సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth), ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా, వారి సన్నిహితులు చేసిన కృషి ఫలించినట్టు సమాచారం. అయితే.. ధనుష్, ఐశ్వర్య మాత్రం మళ్లీ కలిసే అంశంపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.
ఈ నేపథ్యంలోనే ధనుష్, ఐశ్వర్య కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. దాని కోసమే వారు కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెన్నైలోని పోయస్ గార్డెన్లో రూ.100 కోట్లకు పైగా వ్యయంతో ధనుష్ ఓ సువిశాలమైన ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త సంవత్సరంలో గృహ ప్రవేశం జరిగే అవకాశం ఉంది. ఈ గృహ ప్రవేశాన్ని తన భార్య ఐశ్వర్య, పిల్లలతో కలిసి చేయాలని ధనుష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు ధనుష్ - ఐశ్వర్య సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉందని వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.