‘చార్లి’ చూశాక... కళ్లలో నీళ్లు తిరిగాయి!
ABN , First Publish Date - 2022-05-29T07:09:34+05:30 IST
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చార్లి 777’. సంగీత శ్రింగేరి కథానాయిక. కిరణ్ రాజ్ కె. దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 10న విడుదల అవుతోంది...
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చార్లి 777’. సంగీత శ్రింగేరి కథానాయిక. కిరణ్ రాజ్ కె. దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 10న విడుదల అవుతోంది. ఈ చిత్రానికి రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో రక్షిత్తో స్నేహం మొదలైంది. ‘చార్లి...’ అనే సినిమా తీస్తున్నారు అంటే... ఇళ్లల్లో, చాలా తక్కువ బడ్జెట్లో చుట్టేస్తున్నారనుకొన్నా. కానీ విజువల్స్ చూసి ఆశ్చర్యపోయాను. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కలకాలం నిలిచిపోయే చిత్రంలో నేనూ భాగస్వామిని కావడం ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘ఈ సినిమా కోసం 167 రోజులు షూటింగ్ చేశాం. ఈ ప్రయాణంలో చాలా మారాను. ఈ సినిమా చూసి మీరు నవ్వుతారు, ఏడుస్తారు. చివర్లో ఓ ఫీల్తో బయటకు వస్తార’’న్నారు రక్షిత్ శెట్టి.