జగన్తో భేటీ.. నరేశ్ సెటైర్లు!
ABN , First Publish Date - 2022-02-12T21:58:48+05:30 IST
సినీ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ ధరల పెంపు తదితర అంశాల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను చిరంజీవి బృందం కలవడం మంచి పరిణామం అని వీకే నరేశ్ అన్నారు. తాజాగా ఆయన స్పందించారు.
సినీ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ ధరల పెంపు తదితర అంశాల గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను చిరంజీవి బృందం కలవడం మంచి పరిణామం అని వీకే నరేశ్ అన్నారు. తాజాగా ఆయన స్పందించారు. ఫిల్మ్ ఛాంబర్తో సంబంధం లేకుండా వ్యక్తులను పిలిచి భేటీ జరపడం అప్రజాస్వామికం అని ఆయన పేర్కొన్నారు. ఛాంబర్ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రజాస్వామ్యబధ్దంగా సామరస్యపూర్వక తీర్మానాలు, పరిష్కారాలు జరిగితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐక్యతను చాటి చెప్పినట్లు ఉండేది. ఏదేమైనా త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయిని ఆశిస్తున్నా’’ అని నరేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.