Viruman: ఆ రోజు నుంచే ఓటీటీలో కార్తి సినిమా

ABN , First Publish Date - 2022-09-07T23:21:50+05:30 IST

కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తి (Karthi). ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తుంటాడు. కొత్త రకం పాత్రలకు ఎప్పుడు సై అంటుంటాడు. తాజాగా అతడు నటించిన చిత్రం

Viruman: ఆ రోజు నుంచే ఓటీటీలో కార్తి సినిమా

కోలీవుడ్, టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తి (Karthi). ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తుంటాడు. కొత్త రకం పాత్రలకు ఎప్పుడు సై అంటుంటాడు. తాజాగా అతడు నటించిన చిత్రం ‘విరుమన్’ (Viruman). అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్‌గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఆగస్టు 12న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. 


‘విరుమన్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 11నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. భారత్‌తో పాటు 240దేశాల్లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాకు ఎమ్. ముత్తయ్య (M Muthaiah) దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్ (Prakash Raj), సూరి, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘విరుమన్’ ను 2-డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. విరుమన్ కథ విషయానికి వస్తే.. మధురై నేపథ్యంలో కథ జరుగుతుంది. తల్లి మరణానికి తన తండ్రే కారణమని కార్తికి తెలుస్తుంది. అందువల్ల తండ్రిని వెతుకుతూ హీరో ఇంటి నుంచి బయలుదేరుతాడు. తండ్రి నుంచి తన సోదరులను ఏ విధంగా కాపాడాడనేది చిత్ర కథ. ఈ మూవీలో కార్తికి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించాడు. ‘‘నేను రియల్ లైఫ్‌లో అటువంటి తండ్రిని కాదు. సినిమాలోని పాత్రకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాను. కార్తి, అదితి లాంటి నటులతో కలసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రకాష్ రాజ్ తెలిపాడు.

Updated Date - 2022-09-07T23:21:50+05:30 IST