Virata Parvam: ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది..

ABN , First Publish Date - 2022-05-06T17:46:11+05:30 IST

రానా దగ్గుబాటి సోలో హీరోగా హిట్ అందుకొని చాలా కాలం అయింది. ఆయన హీరోగా నటించిన విరాట పర్వం సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Virata Parvam: ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది..

రానా దగ్గుబాటి (Rana Daggubati) సోలో హీరోగా హిట్ అందుకొని చాలా కాలం అయింది. ఆయన హీరోగా నటించిన విరాట పర్వం (Virata Parvam) సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇన్నాళ్ళు అందుకు మోక్షం కలగలేదు. ఎట్టకేలకు విరాట పర్వం సినిమాను విడుదల చేయబోతున్నారు. 2018లో శ్రీ విష్ణు హీరోగా తెరక్కిన నీది నాది ఒకే కథ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల (Venu Udugula) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 


కరోనా ప్యాండమిక్ వల్ల వరుస వేవ్స్ రావడంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోతూ వచ్చింది. ఎలాగోలా చిత్రీకరణ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేసేందుకు మంచి డేట్ దొరకక విడుదల వాయిదా పడింది. గత ఏడాది వెంకటేశ్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాల తరహాలోనే విరాట పర్వం చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై దర్శకుడు స్పందించి థియేటర్స్‌లోనే మా చిత్రాన్ని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది వరుసగా అన్నీ భారీ చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంతో సోలో డేట్ కోసం వేయిట్ చేశారు దర్శక, నిర్మాతలు. 


ఈ నేపథ్యంలో తాజాగా విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదలతేదీని ప్రకటించనున్నారు. కాగా, ఈ సినిమాలో రానా సరసన హీరోయిన్‌గా ఫిదా బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi), నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రియమణి (Priyamani), నందిత దాస్ (Nandita Das) ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.



Updated Date - 2022-05-06T17:46:11+05:30 IST