'విక్రమార్కుడు' సీక్వెల్..?

ABN , First Publish Date - 2021-09-19T14:34:48+05:30 IST

మాస్ మహారా రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ఒకటి 'విక్రమార్కుడు'. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

'విక్రమార్కుడు' సీక్వెల్..?

మాస్ మహారా రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో ఒకటి 'విక్రమార్కుడు'. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించారు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర రవితేజకు మంచి పేరు తీసుకొచ్చింది. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులు 'జింతాతా జితా జితా .. ' అనే రవితేజ మేనరిజాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.



కాగా 'విక్రమార్కుడు' కథను అందించిన రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్ కోసం కథను సిద్ధం చేశారట. అయితే రాజమౌళి మరో రెండు మూడేళ్ల వరకూ ఈ ప్రాజెక్ట్‌పై దృష్ఠి పెట్టలేరట. దాంతో 'విక్రమార్కుడు' సీక్వెల్ కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ దర్శకుడెవరనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. ఇక విజయేంద్ర ప్రసాద్‌కి దర్శకుడు పూరి జగన్నాథ్ గానీ, ఆయన మేకింగ్ స్టైల్ గానీ బాగా ఇష్టం. కాబట్టి 'విక్రమార్కుడు' సీక్వెల్ కథను పూరీకే ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ, 'ఖిలాడి', 'రామారావు' చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Updated Date - 2021-09-19T14:34:48+05:30 IST