బాలీవుడ్ Vikram vedha షూటింగ్ పూర్తి !
ABN , First Publish Date - 2022-06-12T18:29:26+05:30 IST
2017లో తమిళంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’ (Vikram Vedha). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఆర్.మాధవన్ (R Madhavan) హీరోలుగా నటించిన ఈ సినిమాకి పుష్కర్ - గాయత్రి (Pushkar - Gayatri) దంపతులు దర్శకత్వం వహించారు.
2017లో తమిళంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’ (Vikram Vedha). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఆర్.మాధవన్ (R Madhavan) హీరోలుగా నటించిన ఈ సినిమాకి పుష్కర్ - గాయత్రి (Pushkar - Gayatri) దంపతులు దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి క్రిమినల్ గానూ, మాధవన్ పోలీస్ గానూ నటించిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పలువురు దర్శకులు భావించారు. కానీ సరైన కేస్టింగ్ సెట్ అవ్వక అప్పట్లో వర్కవుట్ కాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం పక్కాగా హీరోలు కుదిరారు. స్టార్ హీరోలు హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ ఆలీఖాన్ (Saif Alikhan) లతో పుష్కర్ - గాయత్రి ద్వయమే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసినట్టు ట్విట్టర్ వేదికగా మేకర్స్ తెలుపుతూ.. హృతిక్, సైఫ్ లతో దర్శకుడు గాయత్రి - పుష్కర్ దిగిన ఫోటోను షేర్ చేశారు.
టీ సిరీస్ (T series), రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్స్ (Reliance Entertainments), ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ (Friday Film Works), వైనాట్ (Ynot), ఏపీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ (Ap International Films) సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. రాధికా ఆప్టే, రోషిత్ ష్రాఫ్, యోగితా బిహాని, షరీబ్ హష్మీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. విశాల్ శేఖర్ (Vishal Sekhar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాదాపు రూ. 175 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో హృతిక్ క్రిమినల్ గానూ, సైఫ్ పోలీసాఫీసర్ గానూ నటిస్తున్నారు. మరి ఈ సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.